సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మందికి నిర్మాతలుగా మారాలని ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతుంటారు. కానీ సినిమా సినిమాకి భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరో, హీరోయిన్లు మాత్రం మనకెందుకులే అనుకుంటారు. ముఖ్యంగా నిర్మాతలుగా మారిన హీరోయిన్లను చేతివేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్లు కూడా సినిమాలపై పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు సైతం నిర్మాతలుగా మారారు.
ఇప్పుడు తాప్సీ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ప్రాంజల్ తో కలిసి ‘అవుట్ సైడర్స్’ అనే సంస్థను స్థాపించారు. త్వరలోనే ఈ సంస్థపై ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారు..? ఏ భాషలో సినిమాను నిర్మించబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాప్సీ తన బ్యానర్ కు పెట్టిన పేరు హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బయటవాళ్లకు అవకాశాలు పెద్దగా ఇవ్వరని.. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారినే అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. అందుకే తాప్సీ అవుట్ సైడర్ అనే పేరుని ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక తాప్సీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘హసీనా దిల్ రూబా’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది.
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…