సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మందికి నిర్మాతలుగా మారాలని ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతుంటారు. కానీ సినిమా సినిమాకి భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరో, హీరోయిన్లు మాత్రం మనకెందుకులే అనుకుంటారు. ముఖ్యంగా నిర్మాతలుగా మారిన హీరోయిన్లను చేతివేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్లు కూడా సినిమాలపై పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు సైతం నిర్మాతలుగా మారారు.
ఇప్పుడు తాప్సీ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ప్రాంజల్ తో కలిసి ‘అవుట్ సైడర్స్’ అనే సంస్థను స్థాపించారు. త్వరలోనే ఈ సంస్థపై ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారు..? ఏ భాషలో సినిమాను నిర్మించబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాప్సీ తన బ్యానర్ కు పెట్టిన పేరు హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బయటవాళ్లకు అవకాశాలు పెద్దగా ఇవ్వరని.. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారినే అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. అందుకే తాప్సీ అవుట్ సైడర్ అనే పేరుని ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక తాప్సీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘హసీనా దిల్ రూబా’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది.
This post was last modified on July 15, 2021 1:15 pm
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…