Movie News

ఎక్స్ క్లూజివ్ : రాశిఖన్నా కొత్త వెబ్ సిరీస్!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన రాశిఖన్నా.. స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’, అలానే గోపీచంద్ తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. అలానే మలయాళంలో ‘భ్రమమ్’ అనే సినిమాను పూర్తి చేసింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న కొత్త సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా కనిపించబోతుంది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాశి కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లోనే కనిపించింది. కానీ తొలిసారి ఆమె చుట్టూనే తిరిగే కథ రాసుకున్నారట.

సురేష్ వంగ అనే నూతన దర్శకుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా రాశిఖన్నాను తీసుకున్నారు. ఇందులో ఆమె స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఈ సిరీస్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించిన రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నవంబర్ స్టోరీ’ సిరీస్ కి సినిమాటోగ్రఫీ అందించిన విధు ఈ సిరీస్ కు వర్క్ చేయనున్నారు. అండ్ స్టోరీస్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతోంది. సోనీ ఓటీటీలో ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago