టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన రాశిఖన్నా.. స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’, అలానే గోపీచంద్ తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. అలానే మలయాళంలో ‘భ్రమమ్’ అనే సినిమాను పూర్తి చేసింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న కొత్త సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా కనిపించబోతుంది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాశి కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లోనే కనిపించింది. కానీ తొలిసారి ఆమె చుట్టూనే తిరిగే కథ రాసుకున్నారట.
సురేష్ వంగ అనే నూతన దర్శకుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా రాశిఖన్నాను తీసుకున్నారు. ఇందులో ఆమె స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఈ సిరీస్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించిన రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నవంబర్ స్టోరీ’ సిరీస్ కి సినిమాటోగ్రఫీ అందించిన విధు ఈ సిరీస్ కు వర్క్ చేయనున్నారు. అండ్ స్టోరీస్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతోంది. సోనీ ఓటీటీలో ఈ సిరీస్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
This post was last modified on July 14, 2021 9:58 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…