మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ముందుగా టాప్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను తీసుకున్నారు. గతంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు సైతం ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆ బంధంతోనే మరోసారి పవన్ సినిమా కోసం ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కారణం ఏంటనేది క్లారిటీ లేనప్పటికీ.. ఆయన తప్పుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన రవిచంద్రన్ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండో సినిమాగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రావడం విశేషం. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి!
This post was last modified on July 14, 2021 12:13 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…