మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ముందుగా టాప్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను తీసుకున్నారు. గతంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు సైతం ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆ బంధంతోనే మరోసారి పవన్ సినిమా కోసం ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కారణం ఏంటనేది క్లారిటీ లేనప్పటికీ.. ఆయన తప్పుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన రవిచంద్రన్ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండో సినిమాగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రావడం విశేషం. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి!
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…