మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ముందుగా టాప్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను తీసుకున్నారు. గతంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు సైతం ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆ బంధంతోనే మరోసారి పవన్ సినిమా కోసం ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కారణం ఏంటనేది క్లారిటీ లేనప్పటికీ.. ఆయన తప్పుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన రవిచంద్రన్ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండో సినిమాగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రావడం విశేషం. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి!
This post was last modified on July 14, 2021 12:13 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…