తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రమేష్ వర్మ ట్రాక్ లో పడ్డాడు. దెబ్బకి రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖిలాడి’ అనే సినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు.
నిజానికి తమిళంలో అయితే సీక్వెల్ రాలేదు. ‘రాక్షసుడు 2’ని మనవాళ్లే తెలుగులో ప్లాన్ నచ్చేస్తున్నారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు సిద్ధంగా లేడని సమాచారం. ఆయన చేతుల్లో హిందీ ‘ఛత్రపతి’ ఉంది. అలానే పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకున్నాడు.
ఈ సినిమాలను పూర్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతకాలం ఎదురుచూడలేక దర్శకుడు రమేష్ వర్మ మరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నాడు. ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం కమెడియన్ రేంజ్ నుండి హీరోగా మారిన ఓ నటుడితో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ హీరోని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!
This post was last modified on July 14, 2021 10:40 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…