Movie News

‘రాక్షసుడు 2’లో హీరో ఎవరంటే..?

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రమేష్ వర్మ ట్రాక్ లో పడ్డాడు. దెబ్బకి రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖిలాడి’ అనే సినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు.

నిజానికి తమిళంలో అయితే సీక్వెల్ రాలేదు. ‘రాక్షసుడు 2’ని మనవాళ్లే తెలుగులో ప్లాన్ నచ్చేస్తున్నారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు సిద్ధంగా లేడని సమాచారం. ఆయన చేతుల్లో హిందీ ‘ఛత్రపతి’ ఉంది. అలానే పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకున్నాడు.

ఈ సినిమాలను పూర్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతకాలం ఎదురుచూడలేక దర్శకుడు రమేష్ వర్మ మరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నాడు. ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం కమెడియన్ రేంజ్ నుండి హీరోగా మారిన ఓ నటుడితో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ హీరోని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago