Movie News

‘రాక్షసుడు 2’లో హీరో ఎవరంటే..?

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రమేష్ వర్మ ట్రాక్ లో పడ్డాడు. దెబ్బకి రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖిలాడి’ అనే సినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు.

నిజానికి తమిళంలో అయితే సీక్వెల్ రాలేదు. ‘రాక్షసుడు 2’ని మనవాళ్లే తెలుగులో ప్లాన్ నచ్చేస్తున్నారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు సిద్ధంగా లేడని సమాచారం. ఆయన చేతుల్లో హిందీ ‘ఛత్రపతి’ ఉంది. అలానే పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకున్నాడు.

ఈ సినిమాలను పూర్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతకాలం ఎదురుచూడలేక దర్శకుడు రమేష్ వర్మ మరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నాడు. ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం కమెడియన్ రేంజ్ నుండి హీరోగా మారిన ఓ నటుడితో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ హీరోని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!

This post was last modified on July 14, 2021 10:40 am

Share
Show comments

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

2 hours ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

2 hours ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

2 hours ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

4 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

7 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

10 hours ago