మహేష్ బాబు మూవీ ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’లోనూ నటించింది. కానీ ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లవడంతో తెలుగులో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. కానీ హిందీ మంచి మంచి అవకాశాలందుకుని అక్కడ సెటిలైపోయింది కృతి.
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్కు జోడీగా నటిస్తోంది కృతి. దాని కంటే ముందు కృతి నటించిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రమే.. మిమి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం హిలేరియస్గా ఉండి.. ఇన్స్టంట్గా ప్రేక్షకులకు ఎక్కేస్తోంది. ‘మిమి’ సరోగసీ (అద్దె గర్భం) చుట్టూ నడిచే సినిమా కావడం విశేషం.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భలే పాయింట్ పట్టుకుని ఆద్యంతం సినిమాను వినోదాత్మకంగా నడిపిించినట్లున్నాడు. ‘మిమి’ కథ విషయానికి వస్తే.. డబ్బు మీద బాగా ఆశ ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి ముందుకు ఒక ప్రపోజల్ వస్తుంది. ఒక విదేశీ జంట కోసం ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కంటే రూ.20 లక్షలు చెల్లిస్తారన్నదే ఆ ప్రపోజల్.
కొన్ని నెలల పాటు తల్లిదండ్రులకు కూడా కనిపించకుండా వేరే చోట ఉండి ఆ బిడ్డను కనేసి రూ.20 లక్షలు తీసుకుని హ్యాపీగా ఉండాలన్నది ఆ అమ్మాయి ప్లాన్. రెండు మూడు నెలల వరకు ఇంట్లోనే మేనేజ్ చేసి.. తర్వాత డెలివరీ అయ్యే వరకు తన దగ్గరికి ఈ ప్రపోజల్ తెచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలని అనుకుంటుంది.
విదేశీ జంటకు.. కృతికి మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి పంకజ్ త్రిపాఠి నటించాడు. కృతికి, అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గర్భం దాలిస్తే ఫిగర్ పాడవుతుందా అని డాక్టర్ని కృతి అడగడం.. సరోగసీ ద్వారా బిడ్డను కన్న శిల్పా శెట్టి బాగానే ఉందిగా అంటూ డాక్టర్ చెప్పడం లాంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి.
కృతి డెలివరీకి రెడీ అవుతున్న టైంలో విదేశీ జంట తమకు బిడ్డ వద్దని చెప్పడం ఇందులో ట్విస్ట్. ఇక్కడ కొంచెం కథ ఎమోషనల్ టర్న్ తీసుకునేలా ఉంది. కానీ తర్వాతి సన్నివేశాలు, ముగింపు కూడా హిలేరియస్గా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్లో లాస్ట్ సీన్ హైలైట్గా నిలిచింది. ట్రైలర్ చూస్తే సినిమా స్యూర్ షాట్ హిట్ అనిపిస్తోంది.
This post was last modified on July 13, 2021 4:17 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…