మహేష్ బాబు మూవీ ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’లోనూ నటించింది. కానీ ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లవడంతో తెలుగులో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. కానీ హిందీ మంచి మంచి అవకాశాలందుకుని అక్కడ సెటిలైపోయింది కృతి.
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్కు జోడీగా నటిస్తోంది కృతి. దాని కంటే ముందు కృతి నటించిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రమే.. మిమి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం హిలేరియస్గా ఉండి.. ఇన్స్టంట్గా ప్రేక్షకులకు ఎక్కేస్తోంది. ‘మిమి’ సరోగసీ (అద్దె గర్భం) చుట్టూ నడిచే సినిమా కావడం విశేషం.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భలే పాయింట్ పట్టుకుని ఆద్యంతం సినిమాను వినోదాత్మకంగా నడిపిించినట్లున్నాడు. ‘మిమి’ కథ విషయానికి వస్తే.. డబ్బు మీద బాగా ఆశ ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి ముందుకు ఒక ప్రపోజల్ వస్తుంది. ఒక విదేశీ జంట కోసం ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కంటే రూ.20 లక్షలు చెల్లిస్తారన్నదే ఆ ప్రపోజల్.
కొన్ని నెలల పాటు తల్లిదండ్రులకు కూడా కనిపించకుండా వేరే చోట ఉండి ఆ బిడ్డను కనేసి రూ.20 లక్షలు తీసుకుని హ్యాపీగా ఉండాలన్నది ఆ అమ్మాయి ప్లాన్. రెండు మూడు నెలల వరకు ఇంట్లోనే మేనేజ్ చేసి.. తర్వాత డెలివరీ అయ్యే వరకు తన దగ్గరికి ఈ ప్రపోజల్ తెచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలని అనుకుంటుంది.
విదేశీ జంటకు.. కృతికి మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి పంకజ్ త్రిపాఠి నటించాడు. కృతికి, అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గర్భం దాలిస్తే ఫిగర్ పాడవుతుందా అని డాక్టర్ని కృతి అడగడం.. సరోగసీ ద్వారా బిడ్డను కన్న శిల్పా శెట్టి బాగానే ఉందిగా అంటూ డాక్టర్ చెప్పడం లాంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి.
కృతి డెలివరీకి రెడీ అవుతున్న టైంలో విదేశీ జంట తమకు బిడ్డ వద్దని చెప్పడం ఇందులో ట్విస్ట్. ఇక్కడ కొంచెం కథ ఎమోషనల్ టర్న్ తీసుకునేలా ఉంది. కానీ తర్వాతి సన్నివేశాలు, ముగింపు కూడా హిలేరియస్గా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్లో లాస్ట్ సీన్ హైలైట్గా నిలిచింది. ట్రైలర్ చూస్తే సినిమా స్యూర్ షాట్ హిట్ అనిపిస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…