తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత రచయితగా మారి.. చివరగా దర్శకుడి అవతారం ఎత్తాడు హర్షవర్ధన్. అతడిలో ఒక రచయిత.. దర్శకుడు ఉన్నాడని చాలా కాలం వరకు తెలియలేదు. బుల్లితెరపై.. వెండి తెరపై చాలా కాలం నటుడిగానే ఉండిపోయాడతను. ఆపై ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడం.. రచనలోనూ పాలుపంచుకోవడం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తర్వాత ‘ఇష్క్’.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మనం’ లాంటి సినిమాలతో రైటర్ గా తన బలాన్ని చూపించాడు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో అతను దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం నాలుగేళ్ల ముందే పూర్తయింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఒక వెరైటీ ట్రైలర్ కూడా వదిలాడు హర్ష. మధ్యలో ‘గూగ్లీ’ అంటూ ఈ సినిమాకు టైటిల్ కూడా మార్చి విడుదలకు సన్నాహాలు చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
ఈ చిత్రం గురించి హర్ష కూడా మాట్లాడట్లేదు రెండేళ్లుగా. ఒకప్పట్లాగే నటుడిగా కొనసాగుతున్న అతను.. ఎట్టకేలకు మళ్లీ తన క్రియేటివ్ టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్ అనదగ్గ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బేనర్లో హర్షవర్ధన్ సినిమా తీయబోతున్నాడు.
ఎన్నో ఏళ్ల ప్రయత్నం తర్వాత దర్శకుడిగా ఎంతో ఇష్టపడి, కష్టపడి ఓ సినిమా తీస్తే.. అది విడుదలకు నోచుకోకుండా ఆగిపోతే ఆ దర్శకుడికి మనుగడ కష్టమే. కానీ హర్ష మాత్రం కొంచెం టైం తీసుకుని అయినా పెద్ద బేనర్లో ఫాంలో ఉన్న హీరోతో సినిమా ఓకే చేసుకున్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్ల ముందు సన్నాహాలు మొదలుపెట్టాడు హర్ష. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కబోతోంది. మరి రెండో సినిమా అయినా దర్శకుడిగా హర్ష కోరుకున్న ఆరంభాన్నిస్తుందేమో చూద్దాం.
This post was last modified on July 13, 2021 7:36 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…