తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత రచయితగా మారి.. చివరగా దర్శకుడి అవతారం ఎత్తాడు హర్షవర్ధన్. అతడిలో ఒక రచయిత.. దర్శకుడు ఉన్నాడని చాలా కాలం వరకు తెలియలేదు. బుల్లితెరపై.. వెండి తెరపై చాలా కాలం నటుడిగానే ఉండిపోయాడతను. ఆపై ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడం.. రచనలోనూ పాలుపంచుకోవడం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తర్వాత ‘ఇష్క్’.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మనం’ లాంటి సినిమాలతో రైటర్ గా తన బలాన్ని చూపించాడు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో అతను దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం నాలుగేళ్ల ముందే పూర్తయింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఒక వెరైటీ ట్రైలర్ కూడా వదిలాడు హర్ష. మధ్యలో ‘గూగ్లీ’ అంటూ ఈ సినిమాకు టైటిల్ కూడా మార్చి విడుదలకు సన్నాహాలు చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
ఈ చిత్రం గురించి హర్ష కూడా మాట్లాడట్లేదు రెండేళ్లుగా. ఒకప్పట్లాగే నటుడిగా కొనసాగుతున్న అతను.. ఎట్టకేలకు మళ్లీ తన క్రియేటివ్ టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్ అనదగ్గ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బేనర్లో హర్షవర్ధన్ సినిమా తీయబోతున్నాడు.
ఎన్నో ఏళ్ల ప్రయత్నం తర్వాత దర్శకుడిగా ఎంతో ఇష్టపడి, కష్టపడి ఓ సినిమా తీస్తే.. అది విడుదలకు నోచుకోకుండా ఆగిపోతే ఆ దర్శకుడికి మనుగడ కష్టమే. కానీ హర్ష మాత్రం కొంచెం టైం తీసుకుని అయినా పెద్ద బేనర్లో ఫాంలో ఉన్న హీరోతో సినిమా ఓకే చేసుకున్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్ల ముందు సన్నాహాలు మొదలుపెట్టాడు హర్ష. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కబోతోంది. మరి రెండో సినిమా అయినా దర్శకుడిగా హర్ష కోరుకున్న ఆరంభాన్నిస్తుందేమో చూద్దాం.
This post was last modified on July 13, 2021 7:36 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…