మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడు జరుగతాయో ఏమో స్పష్టత లేదు కానీ.. దాని గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ ఆగట్లేదు. ఇప్పటికే ఉన్న కార్యవర్గం.. కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు.. అలాగే మిగతా వాళ్లు తరచుగా మీడియా ముందుకొచ్చి ఆసక్తికర ప్రకటనలు చేస్తున్నారు. సెన్సేషనల్ కామెంట్లూ చేస్తున్నారు. ‘మా’ ఎన్నికలు ఆలస్యమవుతాయన్న ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా స్తబ్దత నెలకొంది కానీ.. ఇప్పుడు మంచు విష్ణు లైన్లోకి వచ్చి ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఈసారి అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు.. తాను అధ్యక్షుడిగా గెలిస్తే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇవ్వడం విశేషం. ‘మా’ సభ్యుల్ని ఉద్దేశించి రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు ఈ మాట చెప్పాడు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించినపుడే.. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం భరిస్తానని గతంలోనే తాను హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు విష్ణు. ఆ హామీకి కట్టుబడి ఉంటాడనుకున్నారు కానీ.. ఏకంగా మొత్తం ఖర్చు మొత్తం భరిస్తానని అనడం ద్వారా విష్ణు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లే. ‘మా’ భవన నిర్మాణం అన్నది దశాబ్దాల కల. గతంలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ‘మా’ భవనం కట్టుకోలేకపోయింది. తర్వాత ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంది. ‘మా’లో ఇంతమంది పెద్దవాళ్లుండి సొంత భవనం కట్టుకోలేకపోవడం పట్ల ఎంతోమంది పెదవి విరిచారు.
కాగా ఈసారి అనూహ్యంగా అధ్యక్ష పదవికి పోటీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్.. ప్రధానంగా ‘మా’కు భవనం లేకపోవడం గురించి మాట్లాడ్డం, ‘మా’ గత కార్యవర్గాలపై విమర్శలు చేయడం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు భవన నిర్మాణం విషయాన్నే అజెండాగా మార్చుకుని, అందుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తాననడం ద్వారా ‘మా’ సభ్యుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాడు. మరి దీనిపై ప్రకాష్ రాజ్, అధ్యక్ష పదవికి పోటీ పడే మిగతా వాళ్లు ఎలా స్పందిస్తారో.. వాళ్లేం హామీలతో సభ్యులను ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on July 13, 2021 7:37 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…