హిందీలో పేరున్న హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్లు జోరుగా చేస్తున్నారు. ఓటీటీలను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్లు కొంచెం వెనుకబడే ఉన్నారు. వెబ్ సిరీస్లు, వెబ్ ఫిలింల పట్ల ఇప్పుడిప్పుడే మన వాళ్ల ఆలోచన మారుతోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
ఐతే దీనిపై అధికారిక ప్రకటనే రాలేదు ఇంకా. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ తన డిజిటల్ డెబ్యూ గురించి స్పందించాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి నిజమే అని ఆయన ధ్రువీకరించడం విశేషం. ఓటీటీ కోసం సినిమా చేయడం గురించి అడిగితే.. తాము ఒక ఐడియా అనుకున్నామని.. అది తనకు బాగా నచ్చిందని.. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేస్తున్నామని నాగ్ వెల్లడించాడు.
అందరూ అనుకుంటున్నట్లు అది ఓటీటీ సినిమానే అని కూడా నాగ్ చెప్పడం గమనార్హం. ఈ వేదిక తనకు చాలా కొత్త అని.. అందుకే కాస్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని.. సినిమాల్లో ఇప్పటి వరకు చేయనివి ఓటీటీల్లో చేయాలన్నది తన ఆలోచన అని నాగ్ తెలిపాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుమించి ఏమీ స్పందించలేనని.. దానికింకా టైం ఉందని నాగ్ అన్నాడు. నాగ్ చివరి సినిమా ‘వైల్డ్ డాగ్’ను నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి రెడీ అవడం.. కానీ మళ్లీ మనసు మార్చుకుని థియేటర్లలో విడుదల చేయడం తెలిసిందే.
ఐతే థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే జనం బాగానే చూశారు. కంటెంట్ను బట్టి కొన్ని చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే నాగ్ ఓటీటీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ వెబ్ ఫిలిం చేయడానికి రెడీ అయినట్లున్నాడు.
This post was last modified on July 12, 2021 7:26 am
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…
రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…
తమిళ వెట్రి కళగం(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన నటుడు, దళపతి విజయ్ ప్రభావం ఏముంటుందిలే! అనుకున్న వారికి తాజాగా…
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…