ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైనే రెండో సినిమా చేయాలనుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకున్నారు బుచ్చిబాబు. బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ని కలిశారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు బుచ్చిబాబు కో డైరెక్టర్ గా పని చేయడంతో ఎన్టీఆర్ తో మంచి బంధం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యంతోనే ఎన్టీఆర్ కోసం కథ రాసుకొని ఆయనకు వినిపించారు. ఎన్టీఆర్ కి కూడా కథ నచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సినిమాలు కమిట్ అయ్యారు. ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆ తరువాత కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకోనున్నారు. దాని తరువాత ప్రశాంత్ నీల్ సినిమా లైన్ లో ఉంది. దీంతో పాటు రీసెంట్ గా తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ కి కథ చెప్పారు.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాతే బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వగలరు. అయితే ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అప్పటివరకు ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఎదురుచూస్తారా..? అనేది ప్రశ్న. ఇటీవల బుచ్చిబాబు ‘ఉప్పెన’ టీమ్ తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ దర్శకుడు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేవరకు ఎదురుచూస్తారో లేక మరో సినిమా ప్లాన్ చేసుకుంటారో చూడాలి!
This post was last modified on July 11, 2021 10:39 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…