మిళంలో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత అనుకోకుండా నటుడిగా మారి.. ఆర్టిస్టుగా చాలా బిజీ అయిపోయాడు సముద్రఖని. తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన ‘నాడోడిగల్’కు సముద్రఖనినే దర్శకుడు. ఆ చిత్రం తమిళంలో పెద్ద హిట్టే అయింది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు తీశాడు సముద్రఖని.
తన సినిమాల్లోనే క్యామియో తరహా రోల్స్తో ఆకట్టుకున్న సముద్రఖని.. తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారాడు. కొన్ని పాత్రలు అతడికి చాలా మంచి పేరు తెచ్చాయి. ‘విచారణ’ సినిమాలో సముద్రఖని చేసిన పోలీస్ పాత్రకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా రావడం విశేషం.
దీంతో సముద్రఖనిపై వేరే భాషల దర్శకుల కళ్లు కూడా పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగులో అల వైకుంఠపురములో, క్రాక్ లాంటి చిత్రాల్లో నటించాడు. ఇవి రెండూ ఎంత పెద్ద విజయం సాధించాయో.. సముద్రఖనికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలోనూ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సముద్రఖని.. మహేష్ బాబుతోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. మహేష్ ‘సర్కారు వారి పాట’లో మెయిన్ విలన్ పాత్రకు సముద్రఖనినే ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్గా పరశురామ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలోనూ సముద్రఖని పాత్ర క్లిక్ అయితే, సినిమా అంచనాలకు తగ్గట్లు విజయవంతమైతే ఇక సముద్రఖనికి టాలీవుడ్లో తిరుగుండదన్నట్లే. తెలుగులో నంబర్ వన్ విలన్ అయినా అయిపోతాడేమో. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే సముద్రఖని.. చిన్న సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
అశ్విన్ గంగరాజు రూపొందించిన ‘ఆకాశవాణి’లో ఓ కీలక పాత్ర చేసిన ఆయన.. కీరవాణి చిన్న కొడుకు సింహాతో కలిసి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.
This post was last modified on July 10, 2021 1:21 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…