ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్.. ఇండస్ట్రీలో తన చుట్టూ ఒక వ్యవస్థనే నిర్మించుకుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో కలిసి వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన.. తన శిష్యులను కూడా వరుసబెట్టి దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే సుక్కు దగ్గర పని చేసిన పల్నాటి సూర్య ప్రతాప్, హుస్సేన్ షా కిరణ్, హరిప్రసాద్ జక్కాతో పాటు బుచ్చిబాబు సానా దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇంకో ఇద్దరు ముగ్గురికి సినిమాలు సెట్ అవుతున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తాజాగా మొదలైన కప్పెలా రీమేక్తో దర్శకుడిగా పరిచయం అవుతున్న శౌరీ చంద్రశేఖర్ కూడా సుకుమార్ శిష్యుడే. ఆయన అసలు పేరు రమేష్. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ కొన్ని సెంటిమెంట్లతో, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కలిసొచ్చేలా శౌరీ చంద్రశేఖర్ రమేష్ అని పేరు మార్చుకున్నాడు.
ప్రేక్షకులకు రమేష్ కొత్తే కానీ.. ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరే ఉంది. రమేష్ను ఇండస్ట్రీలో మూవీ ఎన్సైక్లోపీడియా అని పిలుస్తారు. ప్రపంచ సినిమాపై ఆయనకున్న పట్టు అసాధారణం అంటారు. ఒక పోలీస్ స్టోరీ తీయాలి అంటే ప్రపంచంలో వివిధ భాషల్లో వచ్చిన బెస్ట్ పోలీస్ సినిమాల సమాచారాన్నంతా అప్పటికప్పుడు చెప్పి అవసరమైన రెఫెరెన్స్ ఇవ్వగల సామర్థ్యం ఆయన సొంతమట. ఇలా ఏ జానర్లో అయినా సరే.. ప్రపంచ సినిమా సమాచారం అంతా ఆయన ఆశువుగా చెప్పేయగలరట.
సుకుమార్ రమేష్ మీద బాగా ఆధారపడతారని.. సినిమాలకు సంబంధించి ఏ రెఫరెన్స్ కావాలన్నా సుక్కు ఆయన్నే అడుగుతాడని… ఎన్నో ఏళ్ల నుంచి సుకుమార్ దగ్గర రమేష్ పని చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. వేలకొద్దీ సినిమాలు చూసిన అనుభవానికి తోడు.. సుకుమార్ శిష్యరికం ద్వారా వచ్చిన నైపుణ్యంతో రమేష్ ఎప్పుడో దర్శకుడు కావాల్సిందని, అయితే అనివార్య కారణాలతో ఆలస్యం అయిందని.. కప్పెలా రీమేక్తో ఎట్టకేలకు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారని చెబుతున్నారు.
This post was last modified on July 10, 2021 9:50 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…