కీరవాణి కొడుకుల్లో ఒకరు ఆయన సంగీత వారసత్వాన్ని అందుకుంటే.. మరొకరు మాత్రం నటన వైపు అడుగులేశారు. పెద్ద కొడుకు కాలభైరవ ఇప్పటికే సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. రెండో కొడుకు సింహా తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ.. రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ మాత్రం అతణ్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మంచి అంచనాల మధ్యే విడుదలైనప్పటికీ ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం దక్కింది. దీని తర్వాత సింహా ఆచితూచి అడుగులు వేయాల్సిన స్థితిలో కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.
గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సతీష్ త్రిపుర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ‘దొంగలున్నారు జాగ్రత్త’లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ పేరు కూడా వెల్లడించలేదు కానీ.. సముద్రఖని పేరును ప్రకటించడం విశేషం. అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాలతో సముద్రఖనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చేస్తూ రాజమౌళి కుటుంబానికి ఆయన సన్నిహితుడిగా మారారు.
ఈ ఫ్యామిలీకే చెందిన అశ్విన్ గంగరాజు రూపొందించిన ‘ఆకాశవాణి’లో కూడా సముద్రఖని కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఇప్పుడు సింహా సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ పేరుతో గతంలోనే ఒక సినిమా వచ్చింది. హిట్టయింది. మరి ఈ మోడర్న్ దొంగలు ప్రేక్షకుల మనసులు ఏమేర దోస్తారో చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
This post was last modified on July 8, 2021 7:22 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…