మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన కొడుకుతో పాటు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె సన్నిహతులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మియా జార్జ్ గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదట. అభిమానులతో కూడా ఆమె ఈ విషయాన్ని పంచుకోలేదు.
సడెన్ గా ఆమె తన కొడుకుతో ఫోటో షేర్ చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు లూకా జోసెఫ్ ఫిలిప్ అనే పేరు కూడా పెట్టేసింది. ఇక షాక్ నుండి తేరుకున్న ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో మియా.. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.
ఇక మియా జార్జ్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతోంది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ అలాంటి హిట్టు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె సునీల్ తో కలిసి ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on July 8, 2021 3:11 pm
సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…
దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…