మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన కొడుకుతో పాటు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె సన్నిహతులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మియా జార్జ్ గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదట. అభిమానులతో కూడా ఆమె ఈ విషయాన్ని పంచుకోలేదు.
సడెన్ గా ఆమె తన కొడుకుతో ఫోటో షేర్ చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు లూకా జోసెఫ్ ఫిలిప్ అనే పేరు కూడా పెట్టేసింది. ఇక షాక్ నుండి తేరుకున్న ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో మియా.. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.
ఇక మియా జార్జ్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతోంది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ అలాంటి హిట్టు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె సునీల్ తో కలిసి ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on July 8, 2021 3:11 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…