మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన కొడుకుతో పాటు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె సన్నిహతులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మియా జార్జ్ గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదట. అభిమానులతో కూడా ఆమె ఈ విషయాన్ని పంచుకోలేదు.
సడెన్ గా ఆమె తన కొడుకుతో ఫోటో షేర్ చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు లూకా జోసెఫ్ ఫిలిప్ అనే పేరు కూడా పెట్టేసింది. ఇక షాక్ నుండి తేరుకున్న ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో మియా.. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.
ఇక మియా జార్జ్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతోంది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ అలాంటి హిట్టు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె సునీల్ తో కలిసి ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on July 8, 2021 3:11 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…