మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన కొడుకుతో పాటు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె సన్నిహతులు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మియా జార్జ్ గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదట. అభిమానులతో కూడా ఆమె ఈ విషయాన్ని పంచుకోలేదు.
సడెన్ గా ఆమె తన కొడుకుతో ఫోటో షేర్ చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు లూకా జోసెఫ్ ఫిలిప్ అనే పేరు కూడా పెట్టేసింది. ఇక షాక్ నుండి తేరుకున్న ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో మియా.. కేరళకు చెందిన అశ్విన్ ఫిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.
ఇక మియా జార్జ్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతోంది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ అలాంటి హిట్టు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె సునీల్ తో కలిసి ‘ఉంగరాల రాంబాబు’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…