మూడేళ్ల ముందు ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది హీరోయిన్లు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టారు. ఇందులో ఎంతోమంది ప్రముఖ కథానాయికలు ఉన్నారు. ఎప్పుడెప్పుడో జరిగిన ఉదంతాలు.. ఎవరికీ చెప్పుకోనివి ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇలాంటి హీరోయిన్కు అలాంటి అనుభవమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి ఉదంతాల గురించి తెలిసి.
ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చాలా ఏళ్ల కిందట ఓ సౌత్ నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌత్ సీనియర్ నటి ఖుష్బు లైన్లోకి వచ్చారు. చాలా ఏళ్ల కిందట తనకు ఎదురైన ‘మీ టూ’ చేదు అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగితే అతడికి తాను ఎలా సమాధానం చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బు వెల్లడించింది.
తాను కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ఒక తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగినట్లు ఖుష్బు చెప్పుకొచ్చింది. ఐతే తాను ఆ హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపితే.. తాను ఆయన కోరిక తీరుస్తానని చెప్పినట్లు ఖుష్బు వెల్లడించింది. ఇది చెంప చెల్లుమనిపించే సమాధానం అనడంలో సందేహం లేదు. దీంతో అప్పట్నుంచి ఆ హీరోతో తనకు మాటలు లేవని ఆమె తెలిపింది.
తెలుగులో ఖుష్బు చేసిన సినిమాలు వేళ్లలో లెక్కబెట్టగలిగేవే. మరి ఆ తక్కువమంది హీరోల్లో ఖుష్బును కమిట్మెంట్ కోరి చెంపపెట్టు లాంటి సమాధానం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో మరి. ఉత్తరాది అమ్మాయి అయిన ఖుష్బు.. సౌత్లో పెద్ద హీరోయిన్గా ఎదిగింది. తమిళంలో ఒక సమయంలో ఆమె నంబర్ వన్ హీరోయిన్గా ఉంది. ఇక్కడే సినిమాల్లో స్థిరపడి.. తమిళ దర్శకుడు సుందర్ను పెళ్లాడిన ఖుష్బు.. కొన్నేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. గత ఏడాదే బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 8, 2021 2:24 pm
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…