మూడేళ్ల ముందు ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది హీరోయిన్లు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టారు. ఇందులో ఎంతోమంది ప్రముఖ కథానాయికలు ఉన్నారు. ఎప్పుడెప్పుడో జరిగిన ఉదంతాలు.. ఎవరికీ చెప్పుకోనివి ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇలాంటి హీరోయిన్కు అలాంటి అనుభవమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి ఉదంతాల గురించి తెలిసి.
ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చాలా ఏళ్ల కిందట ఓ సౌత్ నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌత్ సీనియర్ నటి ఖుష్బు లైన్లోకి వచ్చారు. చాలా ఏళ్ల కిందట తనకు ఎదురైన ‘మీ టూ’ చేదు అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక ప్రముఖ తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగితే అతడికి తాను ఎలా సమాధానం చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బు వెల్లడించింది.
తాను కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ఒక తెలుగు హీరో తనను కమిట్మెంట్ అడిగినట్లు ఖుష్బు చెప్పుకొచ్చింది. ఐతే తాను ఆ హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపితే.. తాను ఆయన కోరిక తీరుస్తానని చెప్పినట్లు ఖుష్బు వెల్లడించింది. ఇది చెంప చెల్లుమనిపించే సమాధానం అనడంలో సందేహం లేదు. దీంతో అప్పట్నుంచి ఆ హీరోతో తనకు మాటలు లేవని ఆమె తెలిపింది.
తెలుగులో ఖుష్బు చేసిన సినిమాలు వేళ్లలో లెక్కబెట్టగలిగేవే. మరి ఆ తక్కువమంది హీరోల్లో ఖుష్బును కమిట్మెంట్ కోరి చెంపపెట్టు లాంటి సమాధానం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో మరి. ఉత్తరాది అమ్మాయి అయిన ఖుష్బు.. సౌత్లో పెద్ద హీరోయిన్గా ఎదిగింది. తమిళంలో ఒక సమయంలో ఆమె నంబర్ వన్ హీరోయిన్గా ఉంది. ఇక్కడే సినిమాల్లో స్థిరపడి.. తమిళ దర్శకుడు సుందర్ను పెళ్లాడిన ఖుష్బు.. కొన్నేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. గత ఏడాదే బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…