Movie News

ఓటీటీ అమ్మకాలపై నిర్మాత ఫైర్!

కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లను క్లోజ్ చేసేశారు. గతేడాది నుండి థియేటర్ వ్యవస్థ పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావించారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఓ పక్క థియేటర్లు తెరుచుకోవడం లేదని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతుంటే మరోపక్క నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మేస్తున్నారు.

భారీ మొత్తాలను ఆఫర్ చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను ఓటీటీ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు గాలం వేస్తున్నాయి. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించిన సినిమా ఇప్పుడు ఓటీటీకు వెళ్తుందని తెలుసుకున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వీరంతా కలిసి మీడియా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన పరోక్షంగా సురేష్ బాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకున్నారంటే పర్వాలేదు కానీ ఇలా పెద్ద వాళ్లు కూడా అమ్ముకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. తాను కూడా నిర్మాతనే అని.. నిర్మాతకు ఉండే కష్టాలు తెలుసని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారని.. దయచేసి సినిమాను, థియేటర్లను కాపాడాలని సునీల్ నారంగ్ రిక్వెస్ట్ చేశారు. ఇండస్ట్రీలోని నిర్మాతలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానని.. అక్టోబర్ 30 వరకు తమ సినిమాలను ఓటీటీలను అమ్మొద్దని వేడుకున్నారు. అప్పటికి పరిస్థితులు చక్కబడకపోతే అప్పుడు ఓటీటీలకు అమ్ముకోవాలని చెప్పారు.

This post was last modified on July 8, 2021 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago