కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లను క్లోజ్ చేసేశారు. గతేడాది నుండి థియేటర్ వ్యవస్థ పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావించారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఓ పక్క థియేటర్లు తెరుచుకోవడం లేదని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతుంటే మరోపక్క నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మేస్తున్నారు.
భారీ మొత్తాలను ఆఫర్ చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను ఓటీటీ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు గాలం వేస్తున్నాయి. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించిన సినిమా ఇప్పుడు ఓటీటీకు వెళ్తుందని తెలుసుకున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వీరంతా కలిసి మీడియా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన పరోక్షంగా సురేష్ బాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకున్నారంటే పర్వాలేదు కానీ ఇలా పెద్ద వాళ్లు కూడా అమ్ముకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. తాను కూడా నిర్మాతనే అని.. నిర్మాతకు ఉండే కష్టాలు తెలుసని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారని.. దయచేసి సినిమాను, థియేటర్లను కాపాడాలని సునీల్ నారంగ్ రిక్వెస్ట్ చేశారు. ఇండస్ట్రీలోని నిర్మాతలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానని.. అక్టోబర్ 30 వరకు తమ సినిమాలను ఓటీటీలను అమ్మొద్దని వేడుకున్నారు. అప్పటికి పరిస్థితులు చక్కబడకపోతే అప్పుడు ఓటీటీలకు అమ్ముకోవాలని చెప్పారు.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…