కరోనా ప్రభావం బాగా తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో రెండు వారాల కిందటే లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఏపీలో షరతులు కొనసాగుతుండటంతో ఇక్కడ ఒక చోట థియేటర్లు తెరిచి లాభం లేదని ఊరుకున్నారు. ఒక రాష్ట్రంలో థియేటర్లు మూతపడి ఇంకో రాష్ట్రంలో తెరుచుకున్నంత మాత్రాన కొత్త సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఏపీలో థియేటర్లు తెరుచుకునే వరకు తెలంగాణలో కూడా ఎదురు చూపులు తప్పలేదు.
ఐతే ఎట్టకేలకు ఏపీలో గోదావరి జిల్లాలు మినహా అన్ని చోట్లా కర్ఫ్యూ ఎత్తేస్తుండటంతో థియేటర్లకు మోక్షం లభిస్తోంది. ఈ నెల 8 నుంచే అక్కడ థియేటర్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కూడా ఆటోమేటిగ్గా థియేటర్లు తెరుచుకోవడం లాంఛనమే. ఇక కొత్త చిత్రాల విడుదల కోసం నిర్మాతల్లో ఎవరు ముందడుగు వేస్తారన్నది తేలాల్సి ఉంది.
ఐతే ఈ విషయం ఏపీలో టికెట్ల రేట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే ఆధారపడి ఉంది. లాక్ డౌన్కు ముందు చివరగా రిలీజైన ‘వకీల్ సాబ్’ సినిమాకు టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సర్కారు కొరడా ఝులింపించిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల కిందటి రేట్లను పట్టుబట్టి అమలు చేశారు. 20, 10 రూపాయల టికెట్లను మళ్లీ తీసుకొచ్చారు. ఐతే చిన్న సెంటర్లలో ఈ రేట్లతో టికెట్లు అమ్మి థియేటర్లను నడిపించడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయంతో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ రేట్లను కొనసాగించాలంటే థియేటర్లను మూసుకోక తప్పదని తేల్చేశారు.
ఐతే సినీ పరిశ్రమ నుంచి తర్వాత ఏపీ సర్కారుకు విజ్ఞప్తులు వెళ్లాయి. ఎ, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఒకే రేట్లను అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. అలాగే కొత్త సినిమా విడుదలైన తొలి వారంలో డిమాండ్ను బట్టి రేట్లు పెంచుకునేలా, అదనపు షోలు వేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. ఈ విన్నపాలపై ఏదో ఒకటి తేలకుండా నిర్మాతలు కొత్త సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయమై చిరంజీవి బృందం జగన్ను కలుస్తారని వార్తలొచ్చాయి. ఆ సంగతేదో తేలాకే థియేటర్లకు మోక్షం లభించే అవకాశముంది.
This post was last modified on July 7, 2021 7:28 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…