సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం అతడి కొత్త చిత్రం ఒకటి ప్రకటించడం తెలిసిందే. అగ్ర దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బేనర్ మీద కృష్ణ కోమలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు భగవద్గీత సాక్షిగా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ పేరుతో ఓ సినిమా రాబోతోందంటూ చాన్నాళ్ల నుంచే టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. దీని దర్శకుడు చాలా చోట్ల ఈ కథను వినిపించాడు.
ఒక దశలో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఆ కథ వేరే కాంపౌండ్లలో తిరిగింది. సాయిధరమ్ తేజ్ ఈ కథ విని సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపించాడు. అతడితో ఈ సినిమా మొదలు కావడమే ఆలస్యం అని ప్రచారం జరిగింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. తేజు ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. చివరికి ఇప్పుడు సత్యదేవ్ హీరోగా భగవద్గీత సాక్షిగా కథను పట్టాలెక్కించారు. కొరటాల శివ లాంటి పేరున్న దర్శకుడు ఈ కథకు ఆమోద ముద్ర వేసి, ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఇదొక స్పెషల్ ఫిలిం అవుతుందనే అంచనాలున్నాయి.
ఈ స్టోరీ రెవల్యూషనరీగా ఉంటుందని.. ముగింపు ప్రేక్షకులను షాక్కు గురి చేస్తుందని అంతర్గత వర్గాల సమాచారం. సుశాంత్ సినిమా ఇచట వాహనములు నిలపరాదుకు పని చేసిన సురేష్ బాబా అనే యువ రచయిత ఈ చిత్రానికి స్క్రిప్టు సహకారం అందించాడు. మంచి కథ పడితే దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటుడు ఇందులో హీరోగా నటిస్తుండటంతో ఇదొక ప్రామిసింగ్ మూవీ అయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 5, 2021 10:15 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…