Movie News

మహేష్-త్రివిక్రమ్.. అప్పుడే మూడు పాటలు


ఈ మధ్యే టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని ఒక కాంబినేషన్ తెరపైకి వచ్చింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే వీరి కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసింది ఈ కలయికలో మూడో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది కానీ.. అది ఇప్పుడిప్పుడే సాధ్యపడేలా కనిపించలేదు.

కానీ ‘వైకుంఠపురములో’ తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా అనివార్య కారణాలతో రద్దు కాగా.. దాని బదులు మహేష్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ పనిలో బిజీగా ఉండగా త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం సినిమా ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది.

ఐతే మామూలుగా సినిమా షూటింగ్ మొదలై కొంత ముందుకు నడిచాక సంగీత దర్శకుడు పని మొదలుపెడుతుంటాడు. సినిమా మధ్య దశలో ఉండగా పాటలు రెడీ అవుతుంటాయి. కానీ ఈ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్న తమన్.. ఇంకా షూటింగ్ మొదలు కాకముందే పాటలు సిద్ధం చేసేస్తుండటం విశేషం. తాజాగా క్లబ్ హౌస్‌ చర్చా కార్యక్రమంలో తమన్.. మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉందని.. చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని.. ఇప్పటికే అందులో మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని అతను వెల్లడించడం విశేషం. దాదాపుగా అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని.. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే పాటల పని పూర్తయిపోతుందని అతను చెప్పాడు. కొన్నేళ్లుగా మంచి ఊపులో ఉన్న తమన్.. ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్నాడు. ఈ ఊపులో తెలుగు తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

13 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

51 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

58 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago