Movie News

‘సలార్’లో వాణీ కపూర్!

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలార్’ అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే నెలలో షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇది కీలకపాత్ర అట. దీనికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్ ను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

గతంలో ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బెల్ బాటమ్’, ‘శంషేరా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గనుక నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on July 5, 2021 7:36 am

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

3 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

5 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

5 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

6 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

6 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

9 hours ago