‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలార్’ అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇది కీలకపాత్ర అట. దీనికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్ ను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బెల్ బాటమ్’, ‘శంషేరా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గనుక నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 7:36 am
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…