‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలార్’ అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇది కీలకపాత్ర అట. దీనికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్ ను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బెల్ బాటమ్’, ‘శంషేరా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గనుక నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. నాగబంధం, రావు బహదూర్ లాంటి ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి దిగాయి.…
తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ…
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…
దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్.. చేసిన పని విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన…
అక్కినేని అఖిల్ను పెద్ద స్టార్ను చేసేస్తుందని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంకర సైతం రిలీజ్కు ముందు…
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…