‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్నారు. ‘సలార్’ అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇది కీలకపాత్ర అట. దీనికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్ ను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బెల్ బాటమ్’, ‘శంషేరా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గనుక నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 7:36 am
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…