ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ…
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. కృష్ణ గారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారని తెలిపారు.
నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ…
గూడుపుఠాణి సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరి గారు చక్కగా నటించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తీశాము. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
దర్శకుడు కుమార్ కె. ఎం మాట్లాడుతూ…
నా మొదటి సినిమా గూడుపుఠాణి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సప్తగిరితో తీసాను. ఆడియన్స్ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా రిచ్ గా రావడానికి నాకు హెల్ప్ అయ్యారు, సూపర్ స్టార్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం నేను మర్చిపోలేని అనుభూతిని తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్
పీఆర్ఒ: ఫ్రీడమ్ మీడియా
This post was last modified on July 4, 2021 8:07 pm
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…