పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాల క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తున్నాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్రను పవన్ చేస్తుండగా.. పృథ్వీరాజ్ పోషించిన కోషీ క్యారెక్టర్లో రానా కనిపించనున్నాడు.
ఈ సినిమాను ఏడాది కిందటే ప్రకటించినప్పటికీ.. సగం చిత్రీకరణ కూడా పూర్తి చేసినప్పటికీ ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఐతే ఎట్టకేలకు టైటిల్ ప్రకటనకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. పరశురామ కృష్ణమూర్తి అనే పేరును ఈ చిత్రానికి ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. మలయాళంలో మాదిరే ఇద్దరు ప్రధాన పాత్రధారుల పేర్ల ఆధారంగానే ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఐతే ఇందులో పరశురామ్ ఎవరు కృష్ణమూర్తి ఎవరు అన్నదే తేలాల్సి ఉంది. పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉంటుంది. పైగా ఆయన రేంజ్ ఎక్కువ కాబట్టి ముందు ఆయన పేరు వచ్చేలా, పవర్ ఫుల్గా కూడా ఉండే పరశురామ్ పేరు ముందు పెట్టి ఉండొచ్చు. రానా పాత్ర పేరు కృష్ణమూర్తి అయి ఉండొచ్చు. కాకపోతే ఈ పేరు కొంచెం పాతగా అనిపిస్తోంది. 30 ప్లస్లో ఉన్న యువకుడికి ఈ పేరు అంతగా సూట్ కాకపోవచ్చు. అయినా చిత్ర బృందం ఓకే అనుకుని ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి రచన బాధ్యత అంతా త్రివిక్రమ్దే. మార్పులు, మాటలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. బహుశా టైటిల్ కూడా ఆయనే పెట్టి ఉండొచ్చు. త్వరలోనే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్ కథానాయకలుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on July 4, 2021 2:04 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…