అర్జున్ రెడ్డి లాంటి ఒరిజినల్ లవ్ స్టోరీ తీసి ఇటు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా, కబీర్ సింగ్ గా దానిని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా తన సత్తా చాటుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఇంత వరకు తదుపరి సినిమా సెట్ కాలేదు. మహేష్, ప్రభాస్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, సందీప్ ఇప్పుడు తన కథకి తగ్గ హీరో కోసం చూస్తున్నాడు.
ఇదిలా వుంటే సందీప్ రెడ్డి వంగాకి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. అతనితో సినిమా చేసే ప్లాన్ లో ఉందట. అతని కథకి హీరో ఇంకా సెట్ కాలేదు కాబట్టి, ఈలోగా తమ వద్ద ఉన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చేయాలని ప్రపోసల్ పెట్టారట.
ఆ మలయాళ చిత్రాన్ని అంతే రాగా, అంతే ఇంటెన్స్ గా తీసే దర్శకుడు సందీప్ అని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారట. అందుకే సందీప్ ని ఒప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని, మంచి పారితోషికం కూడా ఆఫర్ చేసారని టాక్ ఉంది. మరి సందీప్ ఈ రీమేక్ ప్రపోసల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
This post was last modified on May 22, 2020 2:22 am
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…
పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి,…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…