అర్జున్ రెడ్డి లాంటి ఒరిజినల్ లవ్ స్టోరీ తీసి ఇటు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా, కబీర్ సింగ్ గా దానిని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా తన సత్తా చాటుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఇంత వరకు తదుపరి సినిమా సెట్ కాలేదు. మహేష్, ప్రభాస్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, సందీప్ ఇప్పుడు తన కథకి తగ్గ హీరో కోసం చూస్తున్నాడు.
ఇదిలా వుంటే సందీప్ రెడ్డి వంగాకి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. అతనితో సినిమా చేసే ప్లాన్ లో ఉందట. అతని కథకి హీరో ఇంకా సెట్ కాలేదు కాబట్టి, ఈలోగా తమ వద్ద ఉన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చేయాలని ప్రపోసల్ పెట్టారట.
ఆ మలయాళ చిత్రాన్ని అంతే రాగా, అంతే ఇంటెన్స్ గా తీసే దర్శకుడు సందీప్ అని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారట. అందుకే సందీప్ ని ఒప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని, మంచి పారితోషికం కూడా ఆఫర్ చేసారని టాక్ ఉంది. మరి సందీప్ ఈ రీమేక్ ప్రపోసల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
This post was last modified on May 22, 2020 2:22 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…