సింగర్ చిన్మయి గురించి రెండు రోజులుగా ఓ వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఆమె గర్భవతి అయిందని.. పెళ్లయిన ఏడేళ్లకు బిడ్డకు జన్మనివ్వబోతోందని జోరుగా వార్తలు హల్చట్ చేస్తున్నాయి. ఇందుక్కారణం.. ఇటీవలే చిన్మయి కుటుంబంలో జరిగిన ఓ పెళ్లి సందర్భంగా చిన్మయి దిగిన ఫొటోనే. అందులో సంప్రదాయ బ్రాహ్మణ మహిళ తరహాలో మడి చీర కట్టుకుంది. అందులో చూస్తే చిన్మయి కొంచెం కొత్తగా కనిపించింది. కొంచెం లావైనట్లుగా అనిపించింది.
ఐతే ఇదంతా ప్రెగ్నెంట్ కావడంతో వచ్చిన మార్పు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో చిన్మయి స్పందించింది. ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘ పోస్టు ద్వారా ఈ రూమర్కు చెక్ పెట్టింది చిన్మయి. తాను కట్టుకున్న మడి చీర వల్లే తాను ప్రెగ్నెంట్ లాగా కనిపించానని.. అంతకుమించి ఏమీ లేదని చిన్మయి స్పష్టత ఇచ్చింది.
తనకు బేబీ బంప్ వచ్చిందని.. తాను ప్రెగ్నెంట్ అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో తాను స్పందించాల్సి వచ్చిందని చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. మడి చీరను సరిగా కట్టుకోకపోవడం.. పైగా ఎక్కువగా నడవడం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా తయారైందని.. అందుకే తనకు బేబీ బంప్ ఉన్నట్లుగా సదరు ఫొటోలో కనిపించిందని.. తన పెళ్లి నాటి ఫొటో చూసినా తాను ఇలాగే కనిపిస్తానని చిన్మయి చెప్పింది. అంతకుమించి ఏమీ లేదని.. తన ప్రెగ్నెన్సీ గురించి వార్తలు ఆపాలని ఆమె కోరింది. తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి తాను ఎప్పుడూ ఇష్టపడనని.. తాను ఎప్పుడు ప్రెగ్నెంట్ కావాలన్నది తన ఇష్టమని.. పిల్లలు కావాలా వద్దా అన్నది తాను నిర్ణయించుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని గురించి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించనని చిన్మయి స్పష్టం చేసింది. రేప్పొద్దున తనకు పిల్లలు పుట్టినా వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోనని.. వాళ్లు సోషల్ మీడియాలో ఉండరని చిన్మయి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 4, 2021 12:00 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…