సింగర్ చిన్మయి గురించి రెండు రోజులుగా ఓ వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఆమె గర్భవతి అయిందని.. పెళ్లయిన ఏడేళ్లకు బిడ్డకు జన్మనివ్వబోతోందని జోరుగా వార్తలు హల్చట్ చేస్తున్నాయి. ఇందుక్కారణం.. ఇటీవలే చిన్మయి కుటుంబంలో జరిగిన ఓ పెళ్లి సందర్భంగా చిన్మయి దిగిన ఫొటోనే. అందులో సంప్రదాయ బ్రాహ్మణ మహిళ తరహాలో మడి చీర కట్టుకుంది. అందులో చూస్తే చిన్మయి కొంచెం కొత్తగా కనిపించింది. కొంచెం లావైనట్లుగా అనిపించింది.
ఐతే ఇదంతా ప్రెగ్నెంట్ కావడంతో వచ్చిన మార్పు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో చిన్మయి స్పందించింది. ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘ పోస్టు ద్వారా ఈ రూమర్కు చెక్ పెట్టింది చిన్మయి. తాను కట్టుకున్న మడి చీర వల్లే తాను ప్రెగ్నెంట్ లాగా కనిపించానని.. అంతకుమించి ఏమీ లేదని చిన్మయి స్పష్టత ఇచ్చింది.
తనకు బేబీ బంప్ వచ్చిందని.. తాను ప్రెగ్నెంట్ అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో తాను స్పందించాల్సి వచ్చిందని చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. మడి చీరను సరిగా కట్టుకోకపోవడం.. పైగా ఎక్కువగా నడవడం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా తయారైందని.. అందుకే తనకు బేబీ బంప్ ఉన్నట్లుగా సదరు ఫొటోలో కనిపించిందని.. తన పెళ్లి నాటి ఫొటో చూసినా తాను ఇలాగే కనిపిస్తానని చిన్మయి చెప్పింది. అంతకుమించి ఏమీ లేదని.. తన ప్రెగ్నెన్సీ గురించి వార్తలు ఆపాలని ఆమె కోరింది. తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి తాను ఎప్పుడూ ఇష్టపడనని.. తాను ఎప్పుడు ప్రెగ్నెంట్ కావాలన్నది తన ఇష్టమని.. పిల్లలు కావాలా వద్దా అన్నది తాను నిర్ణయించుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని గురించి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించనని చిన్మయి స్పష్టం చేసింది. రేప్పొద్దున తనకు పిల్లలు పుట్టినా వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోనని.. వాళ్లు సోషల్ మీడియాలో ఉండరని చిన్మయి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 4, 2021 12:00 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…