మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. ఎన్నికలకు మూడు నెలల ముందే ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారం పది రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. మీడియాలోనూ సినిమా సంగతుల కంటే ఈ వ్యవహారంపైనే చర్చలు నడుస్తున్నాయి.
కొత్తగా ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రకాష్ రాజ్, ఆయనకు మద్దతు పలుకుతున్న నాగబాబు.. గత కార్యవర్గాలపై విమర్శలు చేయడం ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్కు తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి వాళ్లిద్దరి వ్యాఖ్యలను ఖండించిన నరేష్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలే చేశారు. నరేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మా ఎన్నికలకు సంబంధించి కొందరు హిడెన్ అజెండాతో పని చేస్తున్నారని.. తాము చేసిన మంచి పనులను చెరిపేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించిన నరేష్.. మా లో చిచ్చు రేపాలని చూస్తున్న బిగ్ బాస్ ఎవరు? అంటూ ప్రశ్న సంధించడం విశేషం. బిగ్ బాస్ అనగానే అందరికీ చిరు గుర్తుకొస్తారు. పైగా ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. మరోవైపేమో దాసరి నారాయణరావు మరణాంతరం ఆయన లేని లోటు బాగా కనిపిస్తోందని.. ఆయన ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూర్చుని సెటిల్ చేసేవారని.. ఇప్పుడలాంటి వారు లేరని.. దాసరి స్థానంలోకి ఎవరో ఒకరు రావాలని నరేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.
నిజానికి దాసరి తర్వాత ఆ స్థానంలో చిరు ఉన్నారని ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు భావిస్తున్నారు. చిరు కూడా పెద్ద మనిషి తరహాలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. కానీ నరేష్ ఆయన్ని అలా గుర్తిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ప్రకాష్ రాజ్కు చిరు మద్దతుందని నాగబాబు అంటున్న నేపథ్యంలో నరేష్ పరోక్షంగా చిరును టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారేమో అన్న చర్చ టాలీవుడ్లో నడుస్తోంది.
This post was last modified on July 3, 2021 11:00 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…