అడివి శేష్ అనే పేరుకు గత కొన్నేళ్లలో ఎంతగా విలువ పెరిగిందో తెలిసిందే. అతడి సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చనే నమ్మకం చాలామంది ప్రేక్షకుల్లో ఉంది. కేవలం నటుడిగానే కాక.. రచయితగా అతను తెచ్చుకున్న గుర్తింపు అలాంటిది. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అడివి శేష్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడతడి నుంచి రానున్న ‘మేజర్’పై భారీ అంచనాలే ఉన్నాయి.
ముంబయిలో తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి జరిపినపుడు అక్కడ వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి.. వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎప్పట్లాగే అడివి శేష్ ఈ చిత్రానికి కూడా రచనా సహకారం అందించాడు. ఆ మధ్య రిలీజైన ‘మేజర్’ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
‘మేజర్’పై తెలుగులో మంచి అంచనాలుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ హిందీలో కూడా ఈ సినిమాపై బాగానే భరోసా ఉందని అర్థమవుతోంది. ‘మేజర్’ హిందీ శాటిలైట్ హక్కులను రూ.10 కోట్లకు కొనుగోలు చేయడమే ఇందుకు రుజువు. క్షణం, గూఢచారి చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లతో శేష్కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగే వచ్చింది. అక్కడ అతడికి మార్కెట్ ఏర్పడింది. శేష్కు ఉన్న పేరుకు తోడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అనగానే అక్కడి ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. దీని టీజర్ ఉత్తరాదిన కూడా బాగా ట్రెండ్ అయింది.
ఈ నేపథ్యంలోనే ‘మేజర్’ హిందీ శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడినట్లుంది. తెలుగు శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటే పలికినట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ ఎంతో బయటికి రాలేదు. దీని డిజిటల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ రోజే (జులై 2) ‘మేజర్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సింది. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on July 2, 2021 4:13 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…