ఆనంద్.. హీరో పేరును టైటిల్గా పెట్టిన సినిమానే. కానీ అందులో హీరోయిన్ పాత్రే హైలైట్. ఇందులో రూప పాత్రలో నటించిన కమలిని ముఖర్జీకి ఎంత మంచి పేరొచ్చిందో తెలిసిందే. ఇప్పటికీ ఆమెను ఆ పాత్రలో గుర్తుంచుకుంటారు జనం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ అవకాశాలందుకుంది కమలిని.
ఐతే నిజానికి ఈ పాత్రను కమలిని చేయాల్సింది కాదట. శేఖర్ ముందు రూప పాత్రకు అనుకున్నది సదానట. అప్పటికే జయం సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిన సదాను రూప పాత్రలో నటింపజేయాలనుకున్నాడట. కానీ ఆమె ఈ సినిమా కథ కూడా వినకుండానే నో చెప్పేసిందట. ఇందుకు కారణాలేంటో ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో వెల్లడించింది సదా.
ఆనంద్ కోసం అడగడానికి ముందే ఆమె నటించిన ప్రాణం పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా కొత్త దర్శకుడు, నిర్మాతలు తీసిందని.. ముందు నిండు నూరేళ్ల సావాసం పాట వినిపించడంతో కథ కూడా వినకుండా సినిమా ఓకే చేశానని.. ఐతే ఆ సినిమా పరాజయం పాలవడం తన కెరీర్పై ప్రభావం చూపిందని.. ఆ సమయంలోనే ఆనంద్ కోసం అడగడంతో కొత్త దర్శకుడిని నమ్మి సినిమా చేసే సాహసం చేయలేకపోయానని సదా వెల్లడించింది.
ఆ సమయానికి తన మనసు చెప్పినట్లు నడుచుకున్నానని.. కాబట్టి ఆనంద్ సినిమా చేయనందుకు రిగ్రెట్స్ ఏమీ లేవని సదా అంది. ఐతే చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోవడం గురించి మాత్రం ఎప్పుడూ బాధ పడుతుంటానని సదా చెప్పింది. ముందు జ్యోతిక చేసిన గంగ పాత్ర కోసం అడిగారని.. ఐతే అపరిచితుడులో నటిస్తుండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేకపోయానని.. తర్వాత నయనతార చేసిన పాత్రను తానే చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని సదా చెప్పింది.
This post was last modified on July 3, 2021 7:44 am
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…