ఓపక్క రాజమౌళి.. ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? అందులోనూ బాహుబలి లాంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా కుదరడంతో ఆర్ఆర్ఆర్పై అంచనాలు ఆరంభంలోనే తార స్థాయికి చేరాయి. ఇక సినిమా మేకింగ్ సాగుతూ.. కొన్ని పోస్టర్లు, ప్రోమోలు వదిలేసరికి ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
ఈ సినిమా కోసం మొత్తంగా భారతీయ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కాగా కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత షూటింగ్ పునఃప్రారంభించడం.. బ్యాలెన్స్ టాకీ పార్ట్ పూర్తి చేసి.. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని అప్ డేట్ ఇవ్వడంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.
ఐతే ఈ అప్డేట్తో పాటుగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బుల్లెట్ మీద తారక్, చరణ్ చాలా ఉత్సాహంగా దూసుకెళ్తున్న దృశ్యం కనువిందుగా ఉండటంతో దీన్ని చరణ్, తారక్ అభిమానులిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటో మీమ్ క్రియేటర్లకు కూడా మహ బాగా ఉపయోగపడుతోంది. తారక్, చరణ్ల తలలకు హెల్మెట్లు పెట్టేసి దీన్ని సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారానికి వాడుకున్న తీరు హైలైట్.
ఇక క్రికెట్ అభిమానులేమో తారక్, చరణ్ల స్థానాల్లోకి కోహ్లి, రోహిత్లను తెచ్చి పెట్టేశారు. అలాగే సన్రైజర్స్ అభిమానులేమో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ల ఎడిట్లు చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ హీరోల అభిమానులు సైతం ఈ పోస్టర్ను వాడేసుకున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ జనాలకు చాలా బాగా నచ్చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
This post was last modified on June 30, 2021 9:40 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…