తెలుగులో ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు, యాంథాలజీ ఫిలిమ్స్ జోరు క్రమ క్రమంగా పెరుగుతోంది. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కొంచెం పెద్ద స్థాయిలోనే వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇటీవలే ఆహాలో ఇన్ నేమ్ ఆఫ్ ద గాడ్ పేరుతో కొంచెం పెద్ద స్థాయి వెబ్ సిరీస్ రిలీజైంది. అంతకుముందు లెవెంత్ అవర్ అంటూ పేరున్న సిరీస్ ఒకటి వచ్చింది. త్వరలోనే కుడి ఎడమైతే అంటూ అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ రాబోతోంది.
ఈ కోవలోనే ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఆంథాలజీ ఫిలిం ఒకటి తెరకెక్కుతోంది. అక్టోబర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెరకెక్కుతోంది. ఒక హాలోవీన్ నైట్ జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో ఓ కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంపిక కావడం విశేషం.
తమన్నా, కాజల్, శ్రుతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే డిజిటల్ డెబ్యూ చేసేయగా.. రకుల్ కొంచెం లేటుగా బరిలోకి దిగుతోంది. విశ్వక్సేన్ లాంటి చిన్న హీరోతో కలిసి నటించడానికి ఆమె అంగీకరించడం విశేషమే. ఇందులో నివేథా పెతురాజ్, మాంజిమా మోహన్, మేఘా ఆకాష్, విద్యుల్లేఖ, రెబెక్కా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ప్రధానంగా మహిళల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో విశ్వక్సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం.
ప్రధానంగా తెలుగులో తెరకెక్కే ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి థియేట్రికల్ రిలీజ్ ఉండదు. ఎ.ఎల్.విజయ్ తలైవి లాంటి భారీ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజవుతుందని సమాచారం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…