తెలుగులో ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు, యాంథాలజీ ఫిలిమ్స్ జోరు క్రమ క్రమంగా పెరుగుతోంది. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కొంచెం పెద్ద స్థాయిలోనే వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇటీవలే ఆహాలో ఇన్ నేమ్ ఆఫ్ ద గాడ్ పేరుతో కొంచెం పెద్ద స్థాయి వెబ్ సిరీస్ రిలీజైంది. అంతకుముందు లెవెంత్ అవర్ అంటూ పేరున్న సిరీస్ ఒకటి వచ్చింది. త్వరలోనే కుడి ఎడమైతే అంటూ అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ రాబోతోంది.
ఈ కోవలోనే ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఆంథాలజీ ఫిలిం ఒకటి తెరకెక్కుతోంది. అక్టోబర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెరకెక్కుతోంది. ఒక హాలోవీన్ నైట్ జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో ఓ కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంపిక కావడం విశేషం.
తమన్నా, కాజల్, శ్రుతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే డిజిటల్ డెబ్యూ చేసేయగా.. రకుల్ కొంచెం లేటుగా బరిలోకి దిగుతోంది. విశ్వక్సేన్ లాంటి చిన్న హీరోతో కలిసి నటించడానికి ఆమె అంగీకరించడం విశేషమే. ఇందులో నివేథా పెతురాజ్, మాంజిమా మోహన్, మేఘా ఆకాష్, విద్యుల్లేఖ, రెబెక్కా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ప్రధానంగా మహిళల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో విశ్వక్సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం.
ప్రధానంగా తెలుగులో తెరకెక్కే ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి థియేట్రికల్ రిలీజ్ ఉండదు. ఎ.ఎల్.విజయ్ తలైవి లాంటి భారీ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజవుతుందని సమాచారం.
This post was last modified on June 28, 2021 10:29 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…