తెలుగులో ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు, యాంథాలజీ ఫిలిమ్స్ జోరు క్రమ క్రమంగా పెరుగుతోంది. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి కొంచెం పెద్ద స్థాయిలోనే వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇటీవలే ఆహాలో ఇన్ నేమ్ ఆఫ్ ద గాడ్ పేరుతో కొంచెం పెద్ద స్థాయి వెబ్ సిరీస్ రిలీజైంది. అంతకుముందు లెవెంత్ అవర్ అంటూ పేరున్న సిరీస్ ఒకటి వచ్చింది. త్వరలోనే కుడి ఎడమైతే అంటూ అమలాపాల్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ రాబోతోంది.
ఈ కోవలోనే ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఆంథాలజీ ఫిలిం ఒకటి తెరకెక్కుతోంది. అక్టోబర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెరకెక్కుతోంది. ఒక హాలోవీన్ నైట్ జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో ఓ కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంపిక కావడం విశేషం.
తమన్నా, కాజల్, శ్రుతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే డిజిటల్ డెబ్యూ చేసేయగా.. రకుల్ కొంచెం లేటుగా బరిలోకి దిగుతోంది. విశ్వక్సేన్ లాంటి చిన్న హీరోతో కలిసి నటించడానికి ఆమె అంగీకరించడం విశేషమే. ఇందులో నివేథా పెతురాజ్, మాంజిమా మోహన్, మేఘా ఆకాష్, విద్యుల్లేఖ, రెబెక్కా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ప్రధానంగా మహిళల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో విశ్వక్సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం.
ప్రధానంగా తెలుగులో తెరకెక్కే ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి థియేట్రికల్ రిలీజ్ ఉండదు. ఎ.ఎల్.విజయ్ తలైవి లాంటి భారీ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజవుతుందని సమాచారం.
This post was last modified on June 28, 2021 10:29 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…