టీవీ షోలకు సంబంధించి ప్రోమోలు కట్ చేయడంలో వాటి డైరెక్టర్లు మహా తెలివినే ప్రదర్శిస్తుంటారు. ఆయా షోల్లో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు.. పెద్ద గొడవ అయినట్లుగా చిత్రీకరిస్తూ ప్రోమోలు వదులుతుంటారు. అవి చూసి తర్వాతి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. తీరా ఆ ఎపిసోడ్ చూస్తే అంతా డ్రామా అని తెలుస్తుంది. ప్రోమోల్లో చూపించినంతగా ఏమీ జరిగిపోలేదని తేలుతుంది. ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. అయినాసరే.. మళ్లీ మళ్లీ జనాల చెవుల్లో పూలు పెడుతూనే ఉంటారు. జబర్దస్త్ కామెడీ షోలోనూ తాజాగా ఇదే జరిగింది. ఈ వారం జబర్దస్త్లో హైపర్ ఆది స్కిట్ సందర్బంగా ఓ వివాదం నెలకొన్నట్లుగా ప్రోమో కట్ చేయడం తెలిసిందే.
ఈ స్కిట్కు అతిథిగా వచ్చిన శివ అనే యూట్యూబ్ యాంకర్ తన డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలతో అనసూయ హర్టయి షో నుంచి వాకౌట్ చేసినట్లుగా చూపించారు. ప్రోమోలో అయితే వ్యవహారం చాలా సీరియస్ అయినట్లే కనిపించింది. ఐతే ఇంతకీ ఏం జరిగిందా అని ఎపిసోడ్ చూసిన వాళ్లంతా ఫూల్స్ అయిపోయారు. పొట్టి పొట్టి బట్టలేయడం గురించి జనాలు చేసే కామెంట్లు చూస్తే ఏమనిపిస్తుంది అని శివ అడిగితే.. ఇండస్ట్రీలో ఉండి మీరు కూడా ఏంటి అంది అనసూయ. తర్వాత ఇది నా పర్సనల్ అంది. పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవాలి అని శివ అనడంతో అనసూయ హర్టయి సెట్ నుంచి బయటికి వెళ్లిపోయింది.
ఆది, అభి తదితరులు బయటికెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వాతావరణం చాలా సీరియస్గా మారిపోయింది. కాసేపటికి అనసూయ తిరిగొచ్చింది. వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి ఫక్కున నవ్వేసింది. ఇదంతా డ్రామా అన్న విషయం అప్పుడు బయటపడింది. ఐతే ఇలాంటివి అనసూయ ఎన్నో చూసి ఉంటుంది కాబట్టి ఆమె హర్టవడం నిజమని తాను అనుకోలేదని రోజా చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ ఎదుర్కొంటూ రాటుదేలిన అనసూయ ఇలాంటి ఒక కామెంట్కు అంత హర్టయి ఉంటుందని ఎలా అనుకుంటాం?
This post was last modified on June 26, 2021 11:54 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…