Movie News

నాని స్పీడే స్పీడబ్బా


తెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. ఒకప్పుడైతే నాని సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌ల రేంజ్ తక్కువుండేది. చకచకా సినిమా అవగొట్టేసేవాడు. కానీ ఇప్పుడు అతడి సినిమా స్థాయి పెరిగింది. అతను మిడ్ రేంజ్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాల మీద రూ.30 కోట్లకు మించి బడ్జెట్లు పెడుతున్నారు. అందులోనూ ‘శ్యామ్ సింగరాయ్’ అయితే నాని కెరీర్లోనే అత్యధికంగా.. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. నాని కెరీర్లోనే ఏ చిత్రానికీ లేనంత వర్క్.. శ్రమ ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి.

మూడు దశాబ్దాల కిందటి కోల్‌కతా నగర నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టి కోల్‌కతా సిటీ సెట్ వేశారు. మధ్యలో కొన్ని రోజులు కోల్‌కతాకు కూడా వెళ్లి వచ్చింది చిత్ర బృందం. లాక్ డౌన్ రాకుంటే ఈపాటికి సినిమా విడుదలకు సిద్ధం అయ్యేదే. మధ్యలో విరామం వచ్చినా సరే.. సినిమా మరీ ఏమీ ఆలస్యం కాలేదు.

లాక్‌డౌన్‌కు ముందే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇంత భారీ చిత్రాన్ని కూడా నాని మొత్తంగా మూడు నెలల్లో పూర్తి చేసేయబోతుండటం విశేషం. ఇంకో రెండు వారాల్లోనే షూటింగ్ అయిపోతుందట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయినంత వరకు లాక్ డౌన్ బ్రేక్‌లో నాని డబ్బింగ్ కూడా ఫినిష్ చేసినట్లు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకు జరిగాయట. ఇంకో నెలన్నర కల్లా ‘శ్యామ్ సింగరాయ్’ రెడీ అయిపోతుందని తెలుస్తోంది.

నాని ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. అది ఆగస్టులో రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజవుతుంది. ఈ ఏడాది నాని రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుండటం ఖాయం. ‘శ్యామ్ సింగ రాయ్’ పని పూర్తవగానే ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్‌తో నాని ‘అంటే సుందరానికి’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు నాని.

This post was last modified on June 25, 2021 7:03 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago