పాప్ మ్యూజిక్ గురించి కాస్తో, కూస్తో పరిచయం ఉన్నవారందరికీ బ్రిట్నీ స్పియర్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఫేమస్ పాప్ సింగర్.. ఆమె పాట వింటే ఎవరికైనా ఇట్టే ఊపు వచ్చేస్తోంది. ఆమె ఒక్కసారి పాట పాడితే.. రూ.లక్షలు ఇవ్వడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. ఆ సంపాదనతో ఆమె ఎంతో ఆనందంగా గడుపుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే.. తాను గత 13ఏళ్లు గా ఏరోజు ఆనందంగా లేనని.. తన తండ్రి కారణంగా నరకం చూస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
తనకు గార్డియన్ గా.. తన తండ్రిని ఉంచొద్దంటూ.. తనకు రక్షణ కల్పించాలంటూ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పేర్కొనడం గమనార్హం. తన తండ్రి జేమీ స్పియర్స్.. తన జీవితాన్ని నాశనం చేశాడని.. అతని చెర నుంచి రక్షణ కల్పించాలంటూ ఆమె ఆరోపించింది.
తన గార్డియన్ హోదా నుంచి తండ్రి జేమీని తప్పించాలంటూ బ్రిట్నీ… కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ మీద వాదనలు జరగ్గా.. 20 నిమిషాలపాటు ఏకధాటిన బ్రిట్నీ, జడ్జి ముందు కన్నీళ్లతో తన గొడును వెల్లబోసుకుంది. బలవంతంగా ఆయన్ని తన సంరక్షకుడిగా నియమించారని, కానీ, ఆ తర్వాతే తన జీవితం నాశనం అయ్యిందని బ్రిట్నీ వాపోయింది.
తన తండ్రి వల్ల తాను రోజూ నరకం అనుభవించానని ఆమె వాపోయారు. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశానని చెప్పారు. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడని.. తన సంపాదన లో ఒకటో వంతును కూడా తన ఖర్చులకు ఇవ్వలేదని వాపోయారు.
తన ఫోన్ దగ్గరి నుంచి విలువైన కార్డుల దాకా అన్నీ ఆయన కంట్రోల్లో ఉండిపోయేవని చెప్పారు. రోజూ తనకు లిథియం డ్రగ్ ఎక్కించేవాడని.. తన పిల్లలకు కూడ తనను దూరం చేశాడని ఆరోపించింది. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే నా ఆశలకు అడ్డుపడ్డాడని.. ఆయన సంరక్షణ తనకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసిందని వాపోయింది. ఒకరకంగా ఇది ‘సెక్స్ ట్రాఫికింగ్’కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి అంటూ బ్రీట్నీ పేర్కొనడం గమనార్హం.
This post was last modified on June 24, 2021 8:32 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…