కొన్నేళ్ల ముందు వరకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన స్టార్ ఎవరూ కనిపించేవారు కాదు. సినిమాల బడ్జెట్లు, బిజినెస్లు, కలెక్షన్ల విషయంలో రికార్డులన్నీ ఆయన పేరిటే ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. రజినీ డౌన్ కావడం.. అదే సమయంలో దళపతి విజయ్ రైజ్ అవడం ఒకేసారి జరుగుతూ వచ్చింది. చూస్తుండగానే రజినీని దాటేసి విజయ్ ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు విజయ్ ముందు రజినీనే కాదు.. ఏ తమిళ హీరో కూడా నిలవలేకపోతున్నాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగిపోయాడు.
తెలుగులో సైతం అతను మార్కెట్ను పెంచుకున్నాడు. యావరేజ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటం విజయ్ స్టామినాకు నిదర్శనం. సంక్రాంతికి రిలీజైన ‘మాస్టర్’ ఇలాగే వసూళ్ల మోత మోగించడం తెలిసిందే. ఇప్పుడు అతడి నుంచి రానున్న కొత్త చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న విజయ్ కొత్త చిత్రానికి ‘బీస్ట్’ అనే టైటిల్ ఖరారైంది. మంగళవారం విజయ్ పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు ఈ చిత్రం నుంచి రెండు లుక్స్ వదిలారు. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ట్విట్టర్లో టీవీ ప్రెజెంటర్ డీడీ ఒక స్పేస్ పెట్టింది. ఇందులో ‘బీస్ట్’ దర్శకుడు నెలన్స్తో పాటు కీర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్పేస్కు రికార్డు స్థాయిలో 27, 971 మంది హాజరు కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా ఏ స్పేస్లోనూ ఇంతమంది పాల్గొనలేదు.
ప్రపంచ స్థాయిలో కూడా ఇది రెండో అతి పెద్ద స్పేస్ కావడం విశేషం. ఇప్పటిదాకా చైనీస్ మ్యుజీషియన్ బామ్ బామ్ మీద నిర్వహించిన స్పేస్కు అత్యధికంగా 44,208 మంది హాజరయ్యారు. దాని తర్వాతి స్థానం విజయ్ మీద పెట్టిన స్పేస్కే కావడం గమనార్హం. నిక్ కార్టర్ హ్యాష్ట్యాగ్తో పెట్టిన స్పేస్ (26,218) రికార్డును విజయ్ బర్త్ డే స్పేస్ అధిగమించి రెండో స్థానానికి చేరింది.
This post was last modified on June 22, 2021 8:17 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…