కొన్నేళ్ల ముందు వరకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన స్టార్ ఎవరూ కనిపించేవారు కాదు. సినిమాల బడ్జెట్లు, బిజినెస్లు, కలెక్షన్ల విషయంలో రికార్డులన్నీ ఆయన పేరిటే ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. రజినీ డౌన్ కావడం.. అదే సమయంలో దళపతి విజయ్ రైజ్ అవడం ఒకేసారి జరుగుతూ వచ్చింది. చూస్తుండగానే రజినీని దాటేసి విజయ్ ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు విజయ్ ముందు రజినీనే కాదు.. ఏ తమిళ హీరో కూడా నిలవలేకపోతున్నాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగిపోయాడు.
తెలుగులో సైతం అతను మార్కెట్ను పెంచుకున్నాడు. యావరేజ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటం విజయ్ స్టామినాకు నిదర్శనం. సంక్రాంతికి రిలీజైన ‘మాస్టర్’ ఇలాగే వసూళ్ల మోత మోగించడం తెలిసిందే. ఇప్పుడు అతడి నుంచి రానున్న కొత్త చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న విజయ్ కొత్త చిత్రానికి ‘బీస్ట్’ అనే టైటిల్ ఖరారైంది. మంగళవారం విజయ్ పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు ఈ చిత్రం నుంచి రెండు లుక్స్ వదిలారు. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ట్విట్టర్లో టీవీ ప్రెజెంటర్ డీడీ ఒక స్పేస్ పెట్టింది. ఇందులో ‘బీస్ట్’ దర్శకుడు నెలన్స్తో పాటు కీర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్పేస్కు రికార్డు స్థాయిలో 27, 971 మంది హాజరు కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా ఏ స్పేస్లోనూ ఇంతమంది పాల్గొనలేదు.
ప్రపంచ స్థాయిలో కూడా ఇది రెండో అతి పెద్ద స్పేస్ కావడం విశేషం. ఇప్పటిదాకా చైనీస్ మ్యుజీషియన్ బామ్ బామ్ మీద నిర్వహించిన స్పేస్కు అత్యధికంగా 44,208 మంది హాజరయ్యారు. దాని తర్వాతి స్థానం విజయ్ మీద పెట్టిన స్పేస్కే కావడం గమనార్హం. నిక్ కార్టర్ హ్యాష్ట్యాగ్తో పెట్టిన స్పేస్ (26,218) రికార్డును విజయ్ బర్త్ డే స్పేస్ అధిగమించి రెండో స్థానానికి చేరింది.
This post was last modified on June 22, 2021 8:17 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…