ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది యువ కథానాయకుడు నితిన్ కెరీర్. వరుస ఫ్లాపుల తర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడనుకుంటే.. ఈ మధ్య చెక్, రంగ్దె సినిమాలతో స్వల్ప వ్యవధిలో రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన పవర్ పేట చిత్రాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెడుతున్నాడు నితిన్.
దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయినట్లు కూడా తాజాగా వెల్లడించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్తో చర్చలు పూర్తయ్యాయని.. డిజిటల్ రిలీజ్కే సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
మాస్ట్రో సినిమాను తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావడంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామనుకుంటున్నారట. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ థియేటర్ ఇండస్ట్రీ కుదేలైంది. మళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్లలో సినిమాలు నడవడానికి సమయం పడుతుంది. పైగా రెండు వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆశించినంత ఆసక్తి ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్కు జోడీగా నభా నటేష్ నటించింది. తమన్నా కీలక పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…