ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది యువ కథానాయకుడు నితిన్ కెరీర్. వరుస ఫ్లాపుల తర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడనుకుంటే.. ఈ మధ్య చెక్, రంగ్దె సినిమాలతో స్వల్ప వ్యవధిలో రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన పవర్ పేట చిత్రాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెడుతున్నాడు నితిన్.
దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయినట్లు కూడా తాజాగా వెల్లడించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్తో చర్చలు పూర్తయ్యాయని.. డిజిటల్ రిలీజ్కే సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
మాస్ట్రో సినిమాను తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావడంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామనుకుంటున్నారట. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ థియేటర్ ఇండస్ట్రీ కుదేలైంది. మళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్లలో సినిమాలు నడవడానికి సమయం పడుతుంది. పైగా రెండు వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆశించినంత ఆసక్తి ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్కు జోడీగా నభా నటేష్ నటించింది. తమన్నా కీలక పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
This post was last modified on June 21, 2021 9:28 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…