Movie News

ఓటీటీ రిలీజ్‌కు నితిన్ సినిమా?

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెన‌క్కి అన్న‌ట్లు సాగుతోంది యువ క‌థానాయ‌కుడు నితిన్ కెరీర్. వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడ‌నుకుంటే.. ఈ మ‌ధ్య చెక్, రంగ్‌దె సినిమాల‌తో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు ప‌రాజ‌యాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించిన‌ ప‌వ‌ర్ పేట చిత్రాన్ని ప‌క్క‌న పెట్టేసి ఇప్పుడు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా మొద‌లుపెడుతున్నాడు నితిన్.

దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన‌ట్లు కూడా తాజాగా వెల్ల‌డించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్‌తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని.. డిజిట‌ల్ రిలీజ్‌కే సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మాస్ట్రో సినిమాను త‌క్కువ బ‌డ్జెట్లో, త‌క్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావ‌డంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామ‌నుకుంటున్నార‌ట‌. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్ ఇండ‌స్ట్రీ కుదేలైంది. మ‌ళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్ల‌లో సినిమాలు న‌డ‌వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. పైగా రెండు వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఆశించినంత ఆస‌క్తి ఉండ‌క‌పోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలో సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్‌కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా న‌భా న‌టేష్ న‌టించింది. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం.

This post was last modified on June 21, 2021 9:28 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

45 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago