ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది యువ కథానాయకుడు నితిన్ కెరీర్. వరుస ఫ్లాపుల తర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడనుకుంటే.. ఈ మధ్య చెక్, రంగ్దె సినిమాలతో స్వల్ప వ్యవధిలో రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన పవర్ పేట చిత్రాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెడుతున్నాడు నితిన్.
దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయినట్లు కూడా తాజాగా వెల్లడించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్తో చర్చలు పూర్తయ్యాయని.. డిజిటల్ రిలీజ్కే సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
మాస్ట్రో సినిమాను తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావడంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామనుకుంటున్నారట. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ థియేటర్ ఇండస్ట్రీ కుదేలైంది. మళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్లలో సినిమాలు నడవడానికి సమయం పడుతుంది. పైగా రెండు వరుస ఫ్లాపుల తర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆశించినంత ఆసక్తి ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్కు జోడీగా నభా నటేష్ నటించింది. తమన్నా కీలక పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
This post was last modified on June 21, 2021 9:28 am
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…