Movie News

ఎలాంటి దర్శకుడు.. ఎలా అయిపోయాడు


సినిమా కలలతో సాఫ్ట్‌వేర్ రంగాన్ని వదిలిపెట్టి వచ్చేసి.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని.. ఏ దర్శకుడి దగ్గరా పని చేయకుండానే నేరుగా మెగా ఫోన్ పట్టేసి.. చాలా తక్కువ బడ్జెట్లో ‘పిజ్జా’ అనే సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. కేవలం 27 ఏళ్ల వయసులోనే అతను దర్శకుడిగా మారాడు. 2012లో విడుదలైన ‘పిజ్జా’ అటు తమిళంలో, ఇటు తెలుగులో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఇక రెండో సినిమా ‘జిగర్ తండ’తో అయితే కార్తీక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు. బాలీవుడ్ వాళ్లు కూడా ఆ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. కొత్త తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను అది ఉర్రూతలూగించింది. రెండే రెండు సినిమాలతో కార్తీక్ సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. కానీ ఈ రెండు చిత్రాలతో పెంచిన అంచనాలను కార్తీక్ ఆ తర్వాత అందుకోలేకపోయాడు.

అతడి మూడో సినిమా ‘ఇరైవి’ మంచి చిత్రమే కానీ.. తన తొలి రెండు చిత్రాల స్థాయిలో ఉండదు. అది అనుకున్నంతగా ఆడలేదు కూడా. ఐతే మళ్లీ కార్తీక్ బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘పేట’ లాంటి సాదాసీదా సినిమా తీసి నిరాశపరిచాడు. రజినీతో సినిమా అంటే అద్భుతాలు చేస్తాడనుకుంటే.. అంత మామూలు సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సూపర్ స్టార్ కాబట్టి మామూలు మాస్ సినిమా తీయాలనుకున్నాడేమో.. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన ధనుష్‌తో తన మార్కు సినిమా తీసి మెప్పిస్తాడనుకుంటే.. ఈ చిత్రంతో పూర్తిగా నిరాశ పరిచాడు కార్తీక్. నెట్ ఫ్లిక్స్‌లో శుక్రవారమే విడుదలైన ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.

థియేటర్లలో రిలీజై ఉంటే ధనుష్ కెరీర్లోనే అది పెద్ద డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు. అసలు కార్తీక్ ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడు.. ఏం చూసి ధనుష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.. నిర్మాత అంత బడ్జెట్ ఎలా పెట్టాడు అని జనాలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా కార్తీక్ విషయంలోనూ అందరూ పెదవి విరుస్తున్నారు. తొలి రెండు చిత్రాలతో ఎంతో ఎగ్జైట్ చేసిన ఈ దర్శకుడు.. ఇలా తయారయ్యాడేంటని ఫీలవుతున్నారు. ఇక విక్రమ్, అతడి కొడుకు ధ్రువ్ ప్రధాన పాత్రల్లో తీస్తున్న సినిమాతో కార్తీక్ ఏమాత్రం మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.

This post was last modified on June 19, 2021 9:47 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago