ఇంతకుముందు సినిమాలే గొప్ప.. వెబ్ సిరీస్లు తక్కువ అన్నట్లు చూసిన వాళ్లందరూ ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. వీటి పొటెన్షియాలిటీని అర్థం చేసుకుంటున్నారు. డిజిటల్ మీడియందే భవిష్యత్ అంతా అనే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్లు సైతం వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్లో ముందుగా ఈ విషయంలో ధైర్యం చేసింది హీరోయిన్లే.
తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు వెబ్ సిరీస్ల్లో నటించడం తెలిసిందే. ఐతే హీరోల్లో మాత్రం ఇంకా కదలిక రాలేదు. బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేయగా.. టాలీవుడ్ నుంచి మాత్రం ఇంకా ఏ స్టార్ హీరో డిజిటల్ డెబ్యూ చేయలేదు. ఐతే ఈ విషయంలో సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ముందడుగు వేస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ చేయనున్న తొలి స్టార్ హీరోగా అక్కినేని హీరో రికార్డు సృష్టించబోతున్నట్లు సమాచారం. ఆయన ఒక టాప్ ఓటీటీ కోసం ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయబోతున్నారట. ఈ సిరీస్కు ఎవరు దర్శకత్వం వహిస్తారు, ప్రధాన పాత్రధారులెవరు, ఇతర విశేషాలను త్వరలోనే ప్రకటించబోతున్నారట. నాగ్ నుంచే కొన్ని రోజుల్లో ఈ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు తెలిసింది. కెెరీర్ ఆరంభం నుంచి ట్రెండుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ సాగుతున్నాడు నాగ్.
భిన్నమైన జానర్లు ఎంచుకోవడం, కొత్త దర్శకులను పరిచయం చేయడం ద్వారా ఎప్పుడూ ఔట్ డేట్ అయిన భావన కలిగించలేదు నాగ్. యువ కథానాయకులను మించి కొత్తగా ఆలోచిస్తుంటారాయన. ఆయన చివరి చిత్రం ‘వైల్డ్ డాగ్’ థియేటర్లలో అనుకున్నంత ఆడలేదు కానీ.. నెట్ ఫ్లిక్స్లో అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇది కూడా వెబ్ సిరీస్ చేయడానికి ఆయన్నిపురిగొలిపి ఉండొచ్చేమో. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కాజల్ జోడీగా నాగ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 18, 2021 10:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…