Movie News

నేవీ ఆఫీసర్ గా ‘కేజీఎఫ్’ స్టార్!

‘కేజీఎఫ్’ సినిమా రిలీజయ్యే వరకు హీరో యష్ అంటే కన్నడ వారికి తప్ప మరెవరికీ తెలియదు. అప్పటివరకు కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన యష్ ని ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ ని చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా యష్ కి క్రేజ్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’లో యష్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడనుంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత యష్ దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇందులో హీరో యష్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్లుగా యష్ ని కొత్త లుక్ లో ఎంతో స్టైలిష్ గా ప్రెజంట్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

జీ స్టూడియోస్, హోంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. తమన్నాను తీసుకోవడం వలన తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

This post was last modified on June 17, 2021 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

26 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago