‘కేజీఎఫ్’ సినిమా రిలీజయ్యే వరకు హీరో యష్ అంటే కన్నడ వారికి తప్ప మరెవరికీ తెలియదు. అప్పటివరకు కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన యష్ ని ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ ని చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా యష్ కి క్రేజ్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’లో యష్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడనుంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత యష్ దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇందులో హీరో యష్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్లుగా యష్ ని కొత్త లుక్ లో ఎంతో స్టైలిష్ గా ప్రెజంట్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
జీ స్టూడియోస్, హోంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. తమన్నాను తీసుకోవడం వలన తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…