‘కేజీఎఫ్’ సినిమా రిలీజయ్యే వరకు హీరో యష్ అంటే కన్నడ వారికి తప్ప మరెవరికీ తెలియదు. అప్పటివరకు కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన యష్ ని ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ ని చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా యష్ కి క్రేజ్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’లో యష్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడనుంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత యష్ దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇందులో హీరో యష్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్లుగా యష్ ని కొత్త లుక్ లో ఎంతో స్టైలిష్ గా ప్రెజంట్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
జీ స్టూడియోస్, హోంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. తమన్నాను తీసుకోవడం వలన తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…