Movie News

ఢిల్లీలో ఉన్నరఘురామ గుంటూరు రావాల్సిందేనా?

విద్వేషాలు పెంచేలా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రైవేటు వీడియోలు విడుదల చేస్తూ.. సమాజంలోని వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలతో కేసు నమోదై.. అరెస్టు అయిన నరసాపురం ఎంపీ కమ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లుగా తాజాగా సీఐడీ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆయన రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. బెయిల్ నిబంధనలకు భిన్నంగా ఢిల్లీకి వెళ్లిన రఘురామ ఇప్పుడు గుంటూరుజైలుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. తనపై నమోదైన కేసులతో పాటు.. రిమాండ్ లో ఉన్న తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆరోపిస్తూ బెయిల్ కోసం.. మెరుగైన వైద్యం కోసం అనుమతులు ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందేన ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

అయితే..అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం రఘరామ గుంటూరు జైలుకు వచ్చి బెయిల్ పత్రాలపై సంతకం చేసి బయటకు రావాల్సి ఉంది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జైలుకు వచ్చి సంతకాలు చేయాల్సిన రఘురామ.. వైద్యం కోసమంటూ సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి బేగంపేట ఎయిర్ పోర్టులోని ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో రఘురామ సంతకం లేని పత్రాల్ని గుంటూరు జైలు సూపరింటెండెంట్ ఈ నెల పదిన సీఐడీ కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. బాండ్ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన బెయిల్ పై విడుదల అయినట్లు కాదని పేర్కొంది. ఆయన రిమాండ్ వారెంట్ మనుగడలోనే ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో గుంటూరుకు వచ్చి తన పత్రాలపై సంతకం చేస్తారా? మరేం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బెయిల్ మీద బయట ఉన్న ఎంపీ రఘురామకు తాజాగా కోర్టు రిమాండ్ ను పొడిగిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడతాయన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on June 17, 2021 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

6 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago