నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటివరకు విడుదలైన సినిమా టీజర్, పాటలు అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలవుతునని అన్నారు. సెకండ్ వేవ్ తరువాత రాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాత సునీల్ నారంగ్ మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటే సినిమా ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సునీల్ నారంగ్ అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారని.. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరని ..
తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని అన్నారు. జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…