నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటివరకు విడుదలైన సినిమా టీజర్, పాటలు అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలవుతునని అన్నారు. సెకండ్ వేవ్ తరువాత రాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాత సునీల్ నారంగ్ మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటే సినిమా ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సునీల్ నారంగ్ అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారని.. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరని ..
తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని అన్నారు. జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
This post was last modified on June 16, 2021 12:12 pm
టీ20 ప్రపంచకప్లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…
సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…
వైసీపీ హయాంలో అప్పటి ఆ పార్టీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజును అక్రమంగా అరెస్టు చేసి..…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో…
అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు…
రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…