Movie News

‘లవ్ స్టోరీ’ విడుదలపై నిర్మాత క్లారిటీ!

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటివరకు విడుదలైన సినిమా టీజర్, పాటలు అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు.

చాలా రోజులుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలవుతునని అన్నారు. సెకండ్ వేవ్ తరువాత రాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాత సునీల్ నారంగ్ మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటే సినిమా ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సునీల్ నారంగ్ అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారని.. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరని ..

తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని అన్నారు. జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

This post was last modified on June 16, 2021 12:12 pm

Share
Show comments

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

17 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

29 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago