నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటివరకు విడుదలైన సినిమా టీజర్, పాటలు అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలవుతునని అన్నారు. సెకండ్ వేవ్ తరువాత రాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిర్మాత సునీల్ నారంగ్ మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటే సినిమా ఎలా రిలీజ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని సునీల్ నారంగ్ అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారని.. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరని ..
తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని అన్నారు. జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
This post was last modified on June 16, 2021 12:12 pm
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…