చూడ్డానికి సాఫ్ట్గా కనిపించే కొందరు హీరోయిన్లను కొంచెం కటువుగా ఉండే పాత్రల్లో ఊహించుకోవడం కష్టం. రాశి ఖన్నా ఆ కోవకే చెందుతుంది. కథానాయికగా తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే నుంచి గమనిస్తే రాశి చాలా వరకు సున్నితంగా ఉండే పాత్రల్లోనే నటించింది. అగ్రెసివ్ రోల్స్ పెద్దగా చేయలేదు. ఆమెకు వయొలెంట్ క్యారెక్టర్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఫిలిం మేకర్స్కు రాకపోవచ్చు.
ఐతే కెరీర్లో తొలిసారిగా ఆమె అలాంటి పాత్రనే చేయబోతోంది. రాశి సైకో కిల్లర్ పాత్రలో నటించబోతోందన్న వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐతే రాశి ఈ క్యారెక్టర్ చేయబోయేది సినిమాలో కాదట. వెబ్ సిరీస్లోనట. చాలామంది స్టార్ హీరోయిన్ల బాటలోనే రాశి డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్లో నటించనున్నట్లు ఇటీవలే ఖరారైంది.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ ‘రుద్ర’ లీడ్ రోల్ చేయనున్నాడు. ఆయనకు కూడా ఇదే తొలి వెబ్ సిరీస్. ఇందులో రాశి సైకో కిల్లర్ పాత్ర పోషిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. ఐతే రాశిని అలాంటి పాత్రలో ఊహించుకోవడం తన అభిమానులకు కొంచెం కష్టమే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కొంచెం బోల్డ్గా ఉండే పాత్ర చేస్తే వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.
రాశి మొదట్నుంచి కూడా సాఫ్ట్, లవ్లీ క్యారెక్టర్లే చేస్తూ రావడం.. ఆ పాత్రలతోనే అభిమానులను సంపాదించుకోవడం ఇందుక్కారణం కావచ్చు. మరి సైకో కిల్లర్ పాత్రలో రాశి తన అభిమానులకు ఎలాంటి షాకిస్తుందో చూడాలి. ఆమె హిందీలో షాహిద్ కపూర్ హీరోగానూ ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక దక్షిణాదిన తెలుగు, తమిళంలో, మలయాళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగానే ఉంది ఈ ఢిల్లీ భామ. తెలుగులో ఆమె పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 16, 2021 8:10 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…