చూడ్డానికి సాఫ్ట్గా కనిపించే కొందరు హీరోయిన్లను కొంచెం కటువుగా ఉండే పాత్రల్లో ఊహించుకోవడం కష్టం. రాశి ఖన్నా ఆ కోవకే చెందుతుంది. కథానాయికగా తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే నుంచి గమనిస్తే రాశి చాలా వరకు సున్నితంగా ఉండే పాత్రల్లోనే నటించింది. అగ్రెసివ్ రోల్స్ పెద్దగా చేయలేదు. ఆమెకు వయొలెంట్ క్యారెక్టర్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఫిలిం మేకర్స్కు రాకపోవచ్చు.
ఐతే కెరీర్లో తొలిసారిగా ఆమె అలాంటి పాత్రనే చేయబోతోంది. రాశి సైకో కిల్లర్ పాత్రలో నటించబోతోందన్న వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐతే రాశి ఈ క్యారెక్టర్ చేయబోయేది సినిమాలో కాదట. వెబ్ సిరీస్లోనట. చాలామంది స్టార్ హీరోయిన్ల బాటలోనే రాశి డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్లో నటించనున్నట్లు ఇటీవలే ఖరారైంది.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ ‘రుద్ర’ లీడ్ రోల్ చేయనున్నాడు. ఆయనకు కూడా ఇదే తొలి వెబ్ సిరీస్. ఇందులో రాశి సైకో కిల్లర్ పాత్ర పోషిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. ఐతే రాశిని అలాంటి పాత్రలో ఊహించుకోవడం తన అభిమానులకు కొంచెం కష్టమే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కొంచెం బోల్డ్గా ఉండే పాత్ర చేస్తే వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.
రాశి మొదట్నుంచి కూడా సాఫ్ట్, లవ్లీ క్యారెక్టర్లే చేస్తూ రావడం.. ఆ పాత్రలతోనే అభిమానులను సంపాదించుకోవడం ఇందుక్కారణం కావచ్చు. మరి సైకో కిల్లర్ పాత్రలో రాశి తన అభిమానులకు ఎలాంటి షాకిస్తుందో చూడాలి. ఆమె హిందీలో షాహిద్ కపూర్ హీరోగానూ ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక దక్షిణాదిన తెలుగు, తమిళంలో, మలయాళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగానే ఉంది ఈ ఢిల్లీ భామ. తెలుగులో ఆమె పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ చిత్రాల్లో నటిస్తోంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…