ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తున్న సమయంలో ఈ యాక్సిండెంట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు విజయ్ స్నేహితుడు నవీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పాటు ఒక వ్యక్తి చావుకి కారణమైన నవీన్ పై ఐపీసీ 279, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం నిందితుడికి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ నెల 12న రాత్రి 11:30 గంటలకు బెంగుళూరు జేపీఏ నగర్ లోని సౌత్ సిటీ వద్ద విజయ్, నవీన్ ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అవ్వడంతో అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ పోల్ కి బలంగా ఢీకొట్టింది. దీంతో విజయ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన బ్రెయిన్ డెడ్ అవ్వడంతో చనిపోయారు. విజయ్ అవయవాలను కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. పదేళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో నటిస్తూ.. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. ‘అవనల్ల అవళు’ సినిమాలో అతడు పోషించిన హిజ్రా పాత్రకు నేషనల్ అవార్డు దక్కింది.
This post was last modified on June 15, 2021 4:47 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…