యూవీ క్రియేషన్స్ లో యంగ్ డైరెక్టర్!

గతేడాది విడుదలైన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ లవ్ స్టోరీ, సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ యూత్ ని ఆకట్టుకుంది. పదిహేను నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రాన్ని పొగుడుతూ అప్పట్లో అనుష్క, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ట్వీట్లు కూడా పెట్టారు. 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్‌ ఫిల్మ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీన్ని దీపక్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశారు. గతంలో ఈ డైరెక్టర్ ‘డబ్ల్యూటీఎఫ్‌'(వాట్‌ ఈజ్‌ ది ఫ్యాక్ట్‌), ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడెన్‌ సీక్‌’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు.

వీటితో పాటు ‘ఫిదా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూనే మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ ఆయన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శర్వానంద్ లేదా మరో యంగ్ హీరో ఎవరినైనా తీసుకోవాలని అనుకుంటున్నారు. హీరోని బట్టి సినిమా బడ్జెట్ పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అలానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ లో నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది!