చాలా ఏళ్లుగా అల్లు కాంపౌండ్ లో పని చేస్తూ.. బన్నీ సినిమా వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు వాసు. దీంతో ఆయన్ని బన్నీ వాసు అని పిలవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లపాటు గీతాఆర్ట్స్ సంస్థలోనే పని చేసిన ఇతడు ఇప్పుడు నిర్మాతగా మారి ‘జీఏ 2’ బ్యానర్ పై సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే రీసెంట్ గా ఈ బ్యానర్ పై వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమా థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.
ప్రమోషన్స్ ఎంత గట్టిగా చేసినా.. కథలో సత్తా లేకపోవడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. ఆ తరువాత ‘ఆహా’లో విడుదల చేస్తే అక్కడ కూడా ఎక్కువ వ్యూస్ రాలేదు. ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ అప్సెట్ అయ్యారట. కానీ చేసేదేం లేక ఊరుకుండిపోయారు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై బన్నీ వాసు మరికొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతుండడంతో అల్లు అరవింద్ అతడిని పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కావడానికి వీళ్లేదని చెప్పారట.
కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని.. ఇలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో వచ్చే సినిమాలు క్వాలిటీతో ఉండాలని చెప్పారట. కథ బాగుండడంతో పాటు దర్శకుడిలో సినిమా ఎగ్జిక్యూట్ చేసే సత్తా ఉందనిపిస్తేనే ముందుకు వెళ్లమని సలహా ఇచ్చారట. ‘గీతాఆర్ట్స్’ బ్యానర్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ బ్యానర్ పై అన్నీ భారీ బడ్జెట్ సినిమాలనే రూపొందిస్తున్నారు. అందుకే సెపరేట్ గా ‘జీఏ 2’ బ్యానర్ మొదలుపెట్టి చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీయడం మొదలుపెట్టారు.
This post was last modified on June 12, 2021 7:01 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…