Movie News

బన్నీ వాసుకి క్లాస్ పీకిన అల్లు అరవింద్!

చాలా ఏళ్లుగా అల్లు కాంపౌండ్ లో పని చేస్తూ.. బన్నీ సినిమా వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు వాసు. దీంతో ఆయన్ని బన్నీ వాసు అని పిలవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లపాటు గీతాఆర్ట్స్ సంస్థలోనే పని చేసిన ఇతడు ఇప్పుడు నిర్మాతగా మారి ‘జీఏ 2’ బ్యానర్ పై సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే రీసెంట్ గా ఈ బ్యానర్ పై వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమా థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.

ప్రమోషన్స్ ఎంత గట్టిగా చేసినా.. కథలో సత్తా లేకపోవడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. ఆ తరువాత ‘ఆహా’లో విడుదల చేస్తే అక్కడ కూడా ఎక్కువ వ్యూస్ రాలేదు. ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ అప్సెట్ అయ్యారట. కానీ చేసేదేం లేక ఊరుకుండిపోయారు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై బన్నీ వాసు మరికొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతుండడంతో అల్లు అరవింద్ అతడిని పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కావడానికి వీళ్లేదని చెప్పారట.

కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని.. ఇలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో వచ్చే సినిమాలు క్వాలిటీతో ఉండాలని చెప్పారట. కథ బాగుండడంతో పాటు దర్శకుడిలో సినిమా ఎగ్జిక్యూట్ చేసే సత్తా ఉందనిపిస్తేనే ముందుకు వెళ్లమని సలహా ఇచ్చారట. ‘గీతాఆర్ట్స్’ బ్యానర్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ బ్యానర్ పై అన్నీ భారీ బడ్జెట్ సినిమాలనే రూపొందిస్తున్నారు. అందుకే సెపరేట్ గా ‘జీఏ 2’ బ్యానర్ మొదలుపెట్టి చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీయడం మొదలుపెట్టారు.

This post was last modified on June 12, 2021 7:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

56 minutes ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

3 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

8 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

8 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

9 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

9 hours ago