Movie News

బన్నీ వాసుకి క్లాస్ పీకిన అల్లు అరవింద్!

చాలా ఏళ్లుగా అల్లు కాంపౌండ్ లో పని చేస్తూ.. బన్నీ సినిమా వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు వాసు. దీంతో ఆయన్ని బన్నీ వాసు అని పిలవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లపాటు గీతాఆర్ట్స్ సంస్థలోనే పని చేసిన ఇతడు ఇప్పుడు నిర్మాతగా మారి ‘జీఏ 2’ బ్యానర్ పై సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే రీసెంట్ గా ఈ బ్యానర్ పై వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమా థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.

ప్రమోషన్స్ ఎంత గట్టిగా చేసినా.. కథలో సత్తా లేకపోవడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. ఆ తరువాత ‘ఆహా’లో విడుదల చేస్తే అక్కడ కూడా ఎక్కువ వ్యూస్ రాలేదు. ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ అప్సెట్ అయ్యారట. కానీ చేసేదేం లేక ఊరుకుండిపోయారు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై బన్నీ వాసు మరికొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతుండడంతో అల్లు అరవింద్ అతడిని పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కావడానికి వీళ్లేదని చెప్పారట.

కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని.. ఇలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో వచ్చే సినిమాలు క్వాలిటీతో ఉండాలని చెప్పారట. కథ బాగుండడంతో పాటు దర్శకుడిలో సినిమా ఎగ్జిక్యూట్ చేసే సత్తా ఉందనిపిస్తేనే ముందుకు వెళ్లమని సలహా ఇచ్చారట. ‘గీతాఆర్ట్స్’ బ్యానర్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ బ్యానర్ పై అన్నీ భారీ బడ్జెట్ సినిమాలనే రూపొందిస్తున్నారు. అందుకే సెపరేట్ గా ‘జీఏ 2’ బ్యానర్ మొదలుపెట్టి చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీయడం మొదలుపెట్టారు.

This post was last modified on June 12, 2021 7:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…

19 minutes ago

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని…

1 hour ago

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో…

2 hours ago

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…

3 hours ago

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం…

5 hours ago

మొన్న రణవీర్, నిన్న కునాల్.. నేడు స్వాతి

స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…

6 hours ago