ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్, యాక్టివ్ ప్రొడ్యూసర్లలో బన్నీ వాసు ఒకడు. అల్లు వారి నీడలో ఉండటం వల్ల వాసును పెద్ద నిర్మాతల జాబితాలో పెట్టరు కానీ.. నిజానికి ఆ బేనర్లో తెరకెక్కే ప్రతి సినిమాలో అతడి భాగస్వామ్యం ఉంటుంది. పైకి అల్లు అరవింద్ నిర్మాతగా కనిపిస్తారు కానీ.. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకునేది బన్నీ వాసే. అందుకే వాసును టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడిగానే చూడాలి. పరిశ్రమ పోకడల గురించి మాట్లాడే స్థాయి కూడా అతడికుంది. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన బన్నీ వాసు.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో ఉంది, మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి.. థియేటర్ల పరిస్థితేంటి.. లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
గత ఏడాది కరోనా వేవ్ నుంచి దేశంలోనే మరే పరిశ్రమా కోలుకోని విధంగా టాలీవుడ్ కోలుకుందని.. ఇక్కడ మంచి విజయాలు చూశామని, కానీ దురదృష్టవశాత్తూ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ ఇండస్ట్రీ ప్రమాదంలో పడిందని బన్నీ వాసు అన్నాడు. వేసవిలో రావాల్సిన పెద్ద సినిమాలకు బ్రేక్ పడటంతో వాటి ప్రభావం ఇప్పుడు జూన్, జులై నెలల్లో రావాల్సిన సినిమాలపై పడుతోందని.. వీటికి తోడు చాలా చిన్న, మీడియం రేంజి సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయని.. రాబోయే రోజుల్లో వీటన్నింటినీ అకామొడేట్ చేయడం చాలా కష్టమవుతుందని బన్నీ వాసు అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రాలకు దారి దొరకడం కష్టమని.. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిదంటూ ఓటీటీల బాట పట్టమనే నిష్ఠుర సత్యం చెప్పేశాడు బన్నీ వాసు. తమ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 18 పేజెస్ సినిమాల విషయంలో కూడా పరిస్థితులను బట్టి ఓటీటీల్లో రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తామని అతనన్నాడు. దసరాకు ముందు థియేటర్లు తెరుచుకునే అవకాశాలున్నాయని.. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవాలంటే నవంబరు, డిసెంబరు వరకు ఎదురు చూడాల్సిందే అని బన్నీ వాసు స్పష్టం చేశాడు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం జరగొచ్చని అతను చెప్పాడు.
This post was last modified on June 12, 2021 9:17 am
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…