టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’, గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాశిఖన్నాకు మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కథను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారట. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉండడంతో రాశి కూడా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఈమెతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2023లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 10, 2021 5:31 pm
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…