టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’, గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాశిఖన్నాకు మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కథను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారట. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉండడంతో రాశి కూడా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఈమెతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2023లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 10, 2021 5:31 pm
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. బుధవారం ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…