టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’, గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాశిఖన్నాకు మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కథను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారట. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉండడంతో రాశి కూడా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఈమెతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2023లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 10, 2021 5:31 pm
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…