టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’, గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి కాకుండా బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సిరీస్ పై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాశిఖన్నాకు మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కథను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారట. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉండడంతో రాశి కూడా నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఈమెతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2023లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 10, 2021 5:31 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…