బాలీవుడ్ కాంట్రవర్శల్ క్వీన్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఇంకా ఆదాయపు పన్ను చెల్లించలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఏడాదిగా షూటింగుల్లో పాల్గొనలేదని.. దీంతో సరిపడా డబ్బులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో పన్ను చెల్లించలేదని ఆమె వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టింది.
“నా ఆదాయంలో 45 శాతం వరకూ నేను పన్ను రూపంలో చెల్లిస్తున్నాను. అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించే నటిని నేను. ఐతే ఏడాదిగా ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇంకా సగం పన్నుని చెల్లించలేకపోయాను. దీంతో అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ నేను అందుకు అంగీకరిస్తున్నాను. ఇలా పన్ను చెల్లించడంలో ఆలస్యం చేయడం నా జీవితంలో ఇదే తొలిసారి” అని కంగన వివరించింది.
బాలీవుడ్లో ఎవరేం తప్పు చేసినా నిలదీయడ అలవాటుగా మార్చుకున్న కంగనా.. తాను పన్ను చెల్లించకపోవడంపై ఎవరైనా కూపీ లాగి సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తారేమో అన్న అనుమానంతోనే ఇలా చేసినట్లు ఉంది. ఇటీవల ఆమె మాస్క్ లేకుండా బయట తిరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. షూటింగుల్లేని ఈ ఏడాది కాలంలో కంగనా బోలెడన్ని వివాదాల్లో జోక్యం చేసుకుంది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా, మిగతా పార్టీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి ఒక ట్వీట్లో శ్రుతి మించిపోవడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్ను శాశ్వతంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 10, 2021 8:48 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…