Movie News

‘నిశ్శబ్ధం’ వీడిన కోన వెంకట్

బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద నటుడు నటించిన ‘గులాబో సితాబో’ సినిమా వచ్చే నెల నేరుగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ కాబోతోంది. ఇదే బాటలో మరిన్ని పేరున్న సినిమాలను నేరుగా డిజిటల్‌లో రిలీజ్ చేసేయానికి రంగం సిద్ధమైంది. తమిళం, మలయాళంలో కూడా ఒక స్థాయి ఉన్న సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తున్నారు. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంచెం పట్టుదలగా ఉన్నది తెలుగు సినీ పరిశ్రమే.

గత నెలలో ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా ఒకటి నేరుగా ఆన్ లైన్లో రిలీజైంది కానీ.. తర్వాత మరే సినిమా సాహసం చేయలేదు. ‘వి,’ ‘రెడ్’ లాంటి సినిమాలకు మంచి ఆఫర్లు వచ్చినా వాటి నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌కు నో చెప్పారు. ఐతే కోన వెంకట్ సమర్పణలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’సినిమాను డిజిటల్‌లో రిలీజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.

త్వరలోనే ఈ సినిమా ఆన్ లైన్ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని ఇండస్ట్రీ చర్చ జరుగుతోంది. ఐతే కోన వెంకట్ ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. సినిమా అనేది థియేటర్ల కోసమే రూపొందుతుందని ఆయన ఓ కామెంట్ చేశారు. ‘‘మేమంతా సినీ పరిశ్రమకు ఎంతో ప్రేమతో వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. మా పనికి థియేటర్లలో జనాల నుంచే వచ్చే స్పందనే మాకు ప్రేరణ ఇస్తుంది. ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఆ భావనకు మరేదీ సాటి రాదు. సినిమా అంటే థియేట్రికల్ రిలీజ్‌కు ఉద్దేశించింది. దానికే మా ప్రాధాన్యం’’ అంటూ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కోన.

ఎక్కడా ‘నిశ్శబ్దం’ ప్రస్తావన తేలేదు కానీ.. ఆయన ప్రకటన ఆ సినిమాను ఉద్దేశించిందే అన్నది స్పష్టమైంది. ఇంత స్పష్టంగా చెప్పాక ఇక ‘నిశ్శబ్దం’ డిజిటల్ రిలీజ్ గురించి ఊహాగానాలు కట్టిపెట్టేయడం మంచిదేమో. ఈ చిత్రాన్ని ముందు జనవరి 31న.. ఆ తర్వాత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

This post was last modified on May 17, 2020 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

23 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago