సీనియర్ హీరో రాజశేఖర్ కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరాను ఫేస్ చేయబోతున్నారు. గరుడవేగతో రీఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కల్కి సినిమాలో నటించిన రాజశేఖర్.. దాదాపు మూడేళ్ల విరామం తీసుకున్నాడు. కపటధారి చిత్రానికి ముందు ఆయనే హీరోగా ఎంపికయ్యాడు కానీ.. తర్వాత ఏవో కారణాలతో దాన్నుంచి తప్పుకున్నాడు. ఆపై వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా పట్టాలెక్కలేదు.
కొన్ని నెలల కిందట కరోనా బారిన పడి ఒక దశలో విషమ స్థితిని ఎదుర్కొని, తర్వాత కోలుకున్న రాజశేఖర్.. ఇప్పట్లో సినిమాలు చేస్తాడా అనుకున్నారు కానీ.. కొంచెం గ్యాప్లో మూడు సినిమాలు అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడాయన. ఆ మూడు సినిమాల్లో శేఖర్ కూడా ఒకటి. మలయాళ హిట్ మూవీ జోసెఫ్కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం నెరిసిన జుట్టు, ముడతలు పడ్డ ఛర్మంతో డీగ్లామరస్ అవతారం ఎత్తాడు రాజశేఖర్. లలిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో రాజశేఖర్కు జోడీగా మలయాళ హీరోయిన్ అను సితారను ఓకే చేశారు. ఈ సినిమాలో హీరో కూతురి పాత్ర కూడా చాలా కీలకం. దాని కోసం జార్జిరెడ్డి ఫేమ్ ముస్కాన్ను ఓకే చేసినట్లు తెలిసింది.
ఎంఎల్వీ సత్యనారాయణతో కలిసి రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన దీని ఒరిజినల్ జోసెఫ్ మలయాళంలో మంచి విజయం సాధించింది. మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ మూవీ రాజశేఖర్కు బాగానే సెట్టయ్యే అవకాశముంది.
This post was last modified on June 9, 2021 6:42 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…