మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రెండు భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి కొనసాగింపుగా మలయాళంలో ‘దృశ్యం 2’ని రూపొందించారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీనియర్ హీరో వెంకటేష్ తెలుగు వెర్షన్ ‘దృశ్యం 2’ని మొదలుపెట్టారు. ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం మిగిలిన ప్రాజెక్ట్ లను పక్కన పెట్టి మరీ షూటింగ్ ను పూర్తి చేశారు వెంకీ. తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళంలో కూడా ‘దృశ్యం 2’ని రీమేక్ చేయాలనుకుంటున్నారు. ‘దృశ్యం’ మొదటి పార్ట్ ను తమిళంలో ‘పాపనాశం’ పేరుతో విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్, ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం కూడా వారినే తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ విషయంలో కమల్ హాసన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘పాపనాశం’ సినిమా చేసే సమయానికి కమల్ హాసన్.. గౌతమితో సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుండి ఇద్దరి మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేదట. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం ఆమెని తీసుకోవడం కమల్ కి ఇష్టం లేదట. ఒకవేళ సినిమా చేయాలనుకుంటే గనుక మీనా లేదా వేరే ఎవరినైనా తీసుకోమని చెబుతున్నారట. మరి ఈ విషయంలో జీతూ జోసెఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on June 8, 2021 5:35 pm
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…