బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. నేషనల్ అవార్డు దక్కించుకున్న ఇతడికి ఎందరో అభిమానులున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తన ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ సీజన్ 2 మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్నారు మనోజ్.
చాలా మంది తారలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. తమ క్రేజ్ తగ్గిపోతుందేమోనని, ఓటీటీ హీరోలనే ముద్ర పడిపోతుందేమోనని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ ఓ సలహా ఇచ్చారు మనోజ్ బాజ్ పాయ్. ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దంటూ చెప్పుకొచ్చారు.
వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో లీనమై నటించారు. ఈ పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసిందని మనోజ్ అన్నారు. ఈ తరం వారికి గతంలో తను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమేనని అన్నారు టీనేజ్ పిల్లలు తన దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని.. గతంలో తనకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదని.. ఫ్యామిలీ సిరీస్ కారణంగా తనకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
This post was last modified on June 8, 2021 1:49 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…