బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. నేషనల్ అవార్డు దక్కించుకున్న ఇతడికి ఎందరో అభిమానులున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తన ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ సీజన్ 2 మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్నారు మనోజ్.
చాలా మంది తారలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. తమ క్రేజ్ తగ్గిపోతుందేమోనని, ఓటీటీ హీరోలనే ముద్ర పడిపోతుందేమోనని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ ఓ సలహా ఇచ్చారు మనోజ్ బాజ్ పాయ్. ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దంటూ చెప్పుకొచ్చారు.
వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో లీనమై నటించారు. ఈ పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసిందని మనోజ్ అన్నారు. ఈ తరం వారికి గతంలో తను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమేనని అన్నారు టీనేజ్ పిల్లలు తన దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని.. గతంలో తనకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదని.. ఫ్యామిలీ సిరీస్ కారణంగా తనకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…