బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. నేషనల్ అవార్డు దక్కించుకున్న ఇతడికి ఎందరో అభిమానులున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తన ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ సీజన్ 2 మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్నారు మనోజ్.
చాలా మంది తారలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. తమ క్రేజ్ తగ్గిపోతుందేమోనని, ఓటీటీ హీరోలనే ముద్ర పడిపోతుందేమోనని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ ఓ సలహా ఇచ్చారు మనోజ్ బాజ్ పాయ్. ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దంటూ చెప్పుకొచ్చారు.
వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో లీనమై నటించారు. ఈ పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసిందని మనోజ్ అన్నారు. ఈ తరం వారికి గతంలో తను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమేనని అన్నారు టీనేజ్ పిల్లలు తన దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని.. గతంలో తనకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదని.. ఫ్యామిలీ సిరీస్ కారణంగా తనకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…