బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. నేషనల్ అవార్డు దక్కించుకున్న ఇతడికి ఎందరో అభిమానులున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తన ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ సీజన్ 2 మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్నారు మనోజ్.
చాలా మంది తారలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. తమ క్రేజ్ తగ్గిపోతుందేమోనని, ఓటీటీ హీరోలనే ముద్ర పడిపోతుందేమోనని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ ఓ సలహా ఇచ్చారు మనోజ్ బాజ్ పాయ్. ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దంటూ చెప్పుకొచ్చారు.
వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో లీనమై నటించారు. ఈ పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసిందని మనోజ్ అన్నారు. ఈ తరం వారికి గతంలో తను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమేనని అన్నారు టీనేజ్ పిల్లలు తన దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని.. గతంలో తనకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదని.. ఫ్యామిలీ సిరీస్ కారణంగా తనకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
This post was last modified on June 8, 2021 1:49 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…