ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. రెండు దశాబ్దాల కిందట ‘చిత్రం’ లాంటి సెన్సేషనల్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్బస్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశాడు ఈ యంగ్ హీరో. ఐతే సరైన సినిమాలు ఎంచుకోక, కాలం కలిసి రాక వరుస పరాజయాలు ఎదుర్కొని ఫేడవుట్ అయిపోయిన ఉదయ్.. ఏడేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడి కోట్లాది మందికి వేదన కలిగించాడు.
ఎంతో భవిష్యత్ ఉందనుకున్న హీరో కెరీర్ అలా అయిపోవడం, చివరికి అతను ప్రాణాలే కోల్పోవడం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద విషాదంగా మారింది. ఉదయ్ చివరగా ‘జై శ్రీరామ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. దాని తర్వాత అతను నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ అనే చిత్రం విడుదలకు నోచుకోలేదు.
ఉదయ్ మరణానంతరం అతడికి నివాళిగా ‘చిత్రం చెప్పిన కథ’ను రిలీజ్ చేయడానికి దాని మేకర్స్ గట్టిగానే ప్రయత్నించారు. సినిమా విడుదల గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. చిన్న టీజర్ కూడా వదిలారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా బయటికైతే రాలేదు. చూస్తుండగానే ఏడేళ్లు గడిచిపోయాయి. ‘చిత్రం చెప్పిన కథ’ ఏమైందో తెలియదు. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. చిన్న సినిమాలకు థియేటర్లలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ‘చిత్రం చెప్పిన కథ’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమా మీద పెట్టిన ఖర్చంతా వృథాగా మారకుండా ఎంతో కొంత మొత్తానికి ఓటీటీకి అమ్మేయడానికి సంప్రదింపులు జరుగుతన్నాయట. ఉదయ్ చివరి సినిమాను ఓటీటీలో చూడ్డానికి జనాలు ఎంతో కొంత ఆసక్తి ప్రదర్శిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి త్వరలోనే ‘చిత్రం చెప్పే కథ’ ప్రేక్షకులను పకలరిస్తుందని ఆశిద్దాం. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మున్నా నిర్మించాడు. మదాలస శర్మ కథానాయికగా నటించింది.
This post was last modified on June 7, 2021 2:52 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…